Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
టీచర్లుగా వర్గీకరించండి | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 27,2023

టీచర్లుగా వర్గీకరించండి

- కర్నాటకలో అంగన్వాడీ వర్కర్ల డిమాండ్‌
- సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనలు
- చలిలో రోడ్ల పైనే మహిళల నిద్ర
- అయినా చలించని ప్రభుత్వం
- డిమాండ్లు నెరవేరే దాకా వెనక్కి తగ్గబోమన్న నిరసనకారులు
బెంగళూరు: తమను టీచర్లుగా వర్గీకరించాలన్న ప్రధాన డిమాండ్‌తో కర్నాటకలోని అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. సీఐటీయూ అనుబంధ వర్కర్లు వేలాది మంది ఈ నిరసనల్లో భాగమయ్యారు. ఈనెల 23 నుంచి వారు నిరసనలో ఉన్నారు. బెంగళూరులోని ఫ్రీడమ్‌ పార్కు వద్ద గత రెండు రోజుల నుంచి తీవ్ర చలిలోనే నిద్రిస్తున్నారు. అయితే మహిళలు చలిలో, అర్ధరాత్రుళ్లు ఇబ్బంది పడుతున్నప్పటికీ.. ప్రభుత్వం నంచి ఎలాంటి స్పందనా రాకపోవటం గమనార్హం.
కోలార్‌ జిల్లాకు చెందిన సీఐటీయూ మండల అధ్యక్షురాలు సుజాత మాట్లాడుతూ.. '' అంగన్వాడీ వర్కర్ల విషయంలో చారిత్రక అన్యాయం కొనసాగుతున్నది. కారణం.. వారిని కార్మికులుగా (వర్కర్లు) గుర్తించటం లేదు. మేము చేసేది నిరవధిక దీక్ష. ప్రభుత్వానికి మేము పది డిమాండ్లు పెట్టాము. మా కుటుంబాలను వదిలి మరి మా లక్ష్యాలను సాధించడానికి ఇక్కడికి వచ్చాము. మమ్మల్ని టీచర్లుగా గుర్తించాలి. గ్రాట్యుటీ చెల్లింపులకు మమ్మల్ని అర్హులు చేయాలి. గౌరవ వేతనాలతో 40 ఏండ్లు పని చేయడానికి మమ్మల్ని మీరు కార్యకర్తలుగా ఎందుకు వర్గీకరించారు?'' అని ప్రశ్నించారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో తమపై పని భారం పడుతున్నదనీ, వేధింపులను ఎదుర్కోవాల్సి వస్తున్నదని సుజాత అన్నారు. అంగన్వాడీలో పరిమితికి మించి చిన్నారుల సంఖ్య ఉంటున్నదనీ, పుస్తకాల నిర్వహణ, 'పోషణ్‌' అప్లికేషన్‌లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని నమోదు చేయడం వంటివి అదనపు భారాన్ని మోపుతున్నాయని తెలిపారు. ఒక్క గుడ్డుకు రూ. 5 ఇస్తున్నారనీ, మార్కెట్‌కు వెళ్లి గుడ్లను తామే కొనుగోలు చేసి తీసుకురావాల్సి ఉంటుందని.. ఇందుకోసం తమ భర్తలు ఒకరోజు పనిని విడిచిపెట్టుకొని మరీ వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఇది ఆరోజు తమ భర్తలకు వచ్చే ఆదాయాన్ని దెబ్బతీస్తున్నదని అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల విధుల్లో భాగంగా తమను బూత్‌ స్థాయి అధికారులుగా నియమించడం పని భారాన్ని పెంచుతున్నదని అన్నారు. మండల స్థాయి సమావేశాలను అధికారులు ఏర్పాటు చేస్తే అక్కడకు తప్పక వెళ్లాల్సి ఉంటుందనీ, దీనికి హాజరు కావడానికి ఆ రోజు అంగన్వాడీ కేంద్రాలను మూసివేస్తే మానసిక వేదింపులకు గురవుతామని తెలిపారు. '' మేము 1500 మందిమి గుల్బర్గా నుంచి వచ్చాము. వేతన సవరణ అనేది మా డిమాండ్‌లలో ఒకటి. ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలు నెలకు రూ. 11,500లు, సహాయకులు దాదాపు రూ. 6 వేల వరకు పొందుతున్నారు'' అని పుష్పవతి తెలిపారు. '' కర్నాటకలో సీఐటీయూ అంగన్వాడీ యూనియన్‌ 1994లో గుల్బర్గాలో మొదలైందనీ, ఆ సమయంలో అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ. 120 వచ్చేదనీ, అయితే యూనియన్‌ పోరాటాలతో గౌరవ వేతనం పెరిగిందనీ, లేకపోతే అది మరింత తక్కువగా ఉండేదని '' అన్నారు.
నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ ) ద్వారా నూతన ప్రీ ప్రైమరీ స్కూళ్లు తెరుచుకుంటాయనీ, దీంతో చివరకు అంగన్వాడీలు తగ్గుతాయని సీఐటీయూ కర్నాటక అధ్యక్షురాలు వరలక్ష్మి అన్నారు. దీనికి బదులు ఎల్‌కేజీ, యూకేజీలను అంగన్వాడీలలో ఏర్పాటు చేయాలనీ, వర్కర్లకు కేవలం ఐసీడీఎస్‌ కు సంబంధించిన పనులనే అప్పగించాలని తెలిపారు. అలా అయితే వారు ప్రీ ప్రైమరీ విద్యపై చక్కగా శ్రద్ధ పెట్టగలుగుతారని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తల హాజరు కూడా సంక్లిష్టంగా ఉన్నదనీ సీఐటీయూ మెమోరాండం పేర్కొన్నది. అలాగే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆహారాన్ని అంగన్వాడీ కేంద్రాల వద్దే వండేలా ఫుడ్‌ సరఫరాని వికేంద్రీకరణ చేయాలని వివరించింది. అయితే, తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆందోళనకారులు స్పష్టం చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నా పేరు సావర్కర్‌ కాదు..గాంధీ
చిన్నారుల్లో పోషకాహారలోపం
ప్రజాస్వామ్య భావనపై దాడి
గుజరాత్‌ సీఎంఓ సీనియర్‌ అధికారి రిజైన్‌
పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌-లెఫ్ట్‌ కూటమి సత్తా
ప్రతిపక్షాల న్యాయ పోరాటం
40% పెరిగిన బ్యాంక్‌ ఎగవేతలు
ఆర్థిక బిల్లుకు లోక్‌సభ ఆమోదం
15 రోజుల్లోగా లొంగిపోండి : సుప్రీం
మోడీ సొంత రాష్ట్రంలో పెరిగిన పేదరికం
అదానీ కుంభకోణం నుంచి దృష్టి మరల్చేందుకే !
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
రాహుల్‌పై అనర్హత వేటు
రాహుల్‌కు జైలు
విప్లవ వీరులకు వందనం
పోలవరం మొదటి దశ 41.15 మీటర్ల ఎత్తు
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్‌
గ్యాస్‌ సబ్సిడీకి కోత రూ.44,647 కోట్లు
అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాల్సిందే..
27న కవిత పిటిషన్‌ విచారణ
భువనగిరికి బ్లాక్‌ లెవెల్‌ క్లస్టర్‌ మంజూరు చేయండి
కులాన్ని బట్టి శిక్ష?
బాణసంచా పరిశ్రమలో పేలుడు
మహాత్మాగాంధీ మనవరాలు గోకనీ మృతి
మోడీ మాటలకు అర్థాలే వేరులే...!
ఘనంగా పద్మ అవార్డుల ప్రదానం
బిల్కిస్‌ బానో కేసుపై సుప్రీం ప్రత్యేక బెంచ్‌
సురక్షిత నీరు రావట్లేదు.
సిసోడియా కస్టడీ పొడిగింపు
కేంద్ర ప్రభుత్వ దురహంకారమిది..

తాజా వార్తలు

01:20 PM

ప్రయాణికులకు అందుబాటులోకి కొత్త ఏసీ స్లీపర్ బస్సులు

01:10 PM

28న హైదరాబాద్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం

01:06 PM

కాంగ్రెస్‌లో చేరిన డీ.శ్రీనివాస్.. సొంత ఇంటికి వచ్చినట్లు

12:57 PM

రాహుల్ గాంధీ ఏం నేరం చేశారు : ప్రియాంక గాంధీ

12:41 PM

డేటా చోరీ కేసులో రంగంలోదిగిన ఆర్మీ..

12:29 PM

భారత వ్యతిరేక నిరసనలపై కేంద్రం సీరియస్...

12:29 PM

ప్రారంభమైన కాంగ్రెస్‌ పార్టీ సంకల్ప్‌ సత్యాగ్రహ నిరసన దీక్ష..

12:21 PM

పిడుగుపాటుకు 350కిపైగా మేకలు, గొర్రెలు మృతి..

12:19 PM

ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే తీగల వంతెన...

12:10 PM

ఇస్రో బృందానికి అభినందన‌లు తెలిపిన సీఎం జగన్‌

11:51 AM

సిట్ విచారణకు హజరుకాలేను : బండి సంజయ్‌

11:29 AM

రాహుల్‌కు మద్దతుగా దేశ వ్యాప్తంగా దీక్షలు..నిర‌స‌నలు

11:00 AM

నేను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డట్లు సజ్జల ఎలా తెలిసింది : రామనారాయణ రెడ్డి

10:47 AM

విజయవంతమైన ఇస్రో రాకెట్ ప్రయోగం..

10:26 AM

పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న వ్యక్తిపై దాడి..

10:13 AM

దారుణం వదినను రోకలిబండతో కొట్టి చంపిన మరిది..

10:00 AM

నింగిలోకి దూసుకెళ్లిన ఎల్‌వీఎం-3 నౌక ..

09:30 AM

అమెరికాలో భారత జర్నలిస్ట్‌పై ఖలిస్థానీ మద్దతుదారుల దాడి

09:11 AM

జూపార్కులో గుండెపోటుతో చీతా మృతి..

08:49 AM

ఏపీ మంత్రి సురేష్‌కి తప్పిన పెను పమ్రాదం..

08:35 AM

గాంధీ డిగ్రీపై వ్యాఖ్యపై స్పందించిన గాంధీ మునిమనవడు..

08:21 AM

నేడు డబ్ల్యూపీఎల్ ఢిల్లీ, ముంబై తుది పోరు..

07:58 AM

రాజస్థాన్‌లో స్వ‌ల్ప భూకంపం..

07:35 AM

జైలు నుంచి పెరోల్‌పై వచ్చి వివాహం చేసుకున్న యువకుడు..

07:09 AM

నేడు సిట్ ముందుకు బండి సంజయ్..!

10:48 AM

సీసీఎల్‌-2023 టైటిల్‌ను గెలుచుకున్న తెలుగు వారియర్స్‌

06:20 AM

దారుణం.. క్వారీలో డిటోనేటర్లు పేలి ఇద్దరు మృతి

06:10 AM

నీట్‌కు వ‌య‌స్సు అర్హతపై దాఖలైన పీటీష‌న్ నిరాకరించిన హైకోర్టు..

10:22 PM

RC15 సెట్ లో కేక్ కట్ చేసిన రామ్ చరణ్...

09:16 PM

రేపు శ్రీహరికోట నుంచి ఇస్రో వాణిజ్య రాకెట్ ప్రయోగం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.