Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హిండెన్‌బర్గ్‌ దెబ్బకు షేర్ల విలవిల | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 28,2023

హిండెన్‌బర్గ్‌ దెబ్బకు షేర్ల విలవిల

- నాలుగో వంతు విలువ పతనం
- రూ.4 లక్షల కోట్లు ఫట్‌
- మార్కెట్లపై తీవ్ర ఒత్తిడి
న్యూఢిల్లీ : అదానీ గ్రూపు కంపెనీలు మోసపూరిత చర్యలతో స్టాక్స్‌ విలువను పెంచుకుంటాన్నా యని.. తప్పుడు ఎకౌంట్స్‌కు పాల్పడు తున్నాయని.. మనీ లాండరింగ్‌ చేస్తు న్నాయని అమెరికన్‌ సంస్థ హిండెన్‌ బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్టు దెబ్బ అదానీ షేర్లకు పెను గాయాన్ని చేశాయి. ఆ రిపోర్ట్‌ ప్రభావంతో నాలుగోవంతు విలువ కోల్పోయాయి. రెండు సెషన్ల లో అదానీకి చెందిన 10 లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ కాపిటలైజేషన్‌ రూ.4 లక్షల కోట్లు ఆవిరయ్యింది. హిండెన్‌బర్గ్‌ రిపోర్టుతో బుధవారం ఒక్క సెషన్‌లోనే రూ.1 లక్షల కోట్ల విలువను కోల్పోగా.. శుక్రవారం సెషన్‌లో దాదాపు రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. ఇంట్రాడేలో ఈ సూచీలు 5-25 శాతం క్షీణించాయి. హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ నిరాధారమైందని.. ఆ సంస్థపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటా మని అదానీ గ్రూపు ప్రకటించిన ప్పటికీ.. ఇన్వెస్టర్లు విశ్వసించలేక పోయారు. మరోవైపు అదానీ గ్రూపు అవకతవకలపై తాము ఏ విచారణకు అయినా సిద్దమని.. తమ రిపోర్టుకు కట్టుబడి ఉన్నామని హిండెన్‌బర్గ్‌ ప్రకటించడం అదానీ షేర్లను మరింత ఒత్తిడికి గురి చేసింది. జనవరి 24న అదానీ గ్రూపు కంపెనీల మార్కెట్‌ కాపిటలైజేషన్‌ విలువ రూ19 లక్షల కోట్లుగా ఉండగా.. జనవరి 27 ముగింపు నాటికి రూ.15 లక్షల కోట్లకు పరిమితమయ్యింది. అదానీ షేర్లలో అమ్మకాల వల్ల ఎల్‌ఐసి దాదా పు రూ.18వేల కోట్ల నష్టాన్ని చవి చూసింది. అదానీ గ్రూపులోని కంపెనీ ల్లో జనవరి 24 నాటికి ఎల్‌ఐసి పెట్టు బడి రూ.81,268 కోట్లుగా ఉండగా.. 27 నాటికి ఇది రూ.62,621 కోట్లకు పడిపోయింది. అదానీ గ్రూపు అవకతవకలపై హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ను అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడిదారుడు బిల్‌ అక్‌మాన్‌ సమర్థించారు. ''ఆ రిపోర్ట్‌ అత్యంత విశ్వసనీయమైనది, చాలా లోతుగా పరిశోధించబడిందని'' అక్‌మాన్‌ శుక్రవారం ట్వీట్‌ చేశారు.
ఎఫ్‌పిఒపై నీలినీడలు
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ. 20,000 కోట్ల ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పిఒ) శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో పెట్టుబడులకు బుధవారం యాంకర్‌ ఇన్వెస్టర్లను స్పందన రాగా.. శుక్రవారం రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి అనాసక్తి వ్యక్తమయ్యిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఎఫ్‌పిఒ జనవరి 31 వరకు కొనసాగనుంది. ఎఫ్‌పిఒలో ఒక్కో షేరును రూ.3,112 - రూ.3,276 ధరల శ్రేణిలో విక్ర యించనున్నారు. తాజా ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం షేరు ధర ఎఫ్‌పిఒ ధర కంటే కిందకు చేరి రూ.2,768 వద్ద నమోదవుతోంది. దీంతో ఈ ఎఫ్‌పిఒ ఫ్లాప్‌ కానుందని అంచనాలు వెలుపడుతున్నాయి.
కుబేరుల్లో ఏడో స్థానానికి అదానీ..
హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ దెబ్బకు అత్యంత కుబేరుడైనా గౌతం అదానీ సంపద కీలకమైన 100 బిలియన్ల మార్క్‌కు దిగువకు పడిపోయింది. రెండు రోజుల్లో ఆయన కంపెనీల షేర్ల పతనంతో ప్రపంచ సంపన్నుల జాబితాలో అదానీ ర్యాంకింగ్‌ ఏడో స్థానానికి పడిపోయింది. ఇంతక్రితం ఆయన నాలుగో స్థానంలో ఉన్నారు. కొన్ని నెలల క్రితం ఓ దశలో రెండో స్థానానికి ఎగబాకగా.. చాలా కాలం మూడో స్థానంలో కొనసాగారు.
రెండు సెషన్లలో అదానీ షేర్ల పతన తీరు
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌                   -19.77%
అదానీ పోర్ట్స్‌                              - 21.58%
అదానీ విల్మర్‌                             -9.74%
అదానీ గ్రీన్‌                                -22.46%
అదానీ పవర్‌                              -9.72%
అదానీ ట్రాన్స్‌మీషన్‌                   -27.08%
అదానీ టోటల్‌                           -24.76%
ఎసిసి                                      -19.52%
అంబూజా సిమెంట్‌                    -23.75%

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నా పేరు సావర్కర్‌ కాదు..గాంధీ
చిన్నారుల్లో పోషకాహారలోపం
ప్రజాస్వామ్య భావనపై దాడి
గుజరాత్‌ సీఎంఓ సీనియర్‌ అధికారి రిజైన్‌
పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌-లెఫ్ట్‌ కూటమి సత్తా
ప్రతిపక్షాల న్యాయ పోరాటం
40% పెరిగిన బ్యాంక్‌ ఎగవేతలు
ఆర్థిక బిల్లుకు లోక్‌సభ ఆమోదం
15 రోజుల్లోగా లొంగిపోండి : సుప్రీం
మోడీ సొంత రాష్ట్రంలో పెరిగిన పేదరికం
అదానీ కుంభకోణం నుంచి దృష్టి మరల్చేందుకే !
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
రాహుల్‌పై అనర్హత వేటు
రాహుల్‌కు జైలు
విప్లవ వీరులకు వందనం
పోలవరం మొదటి దశ 41.15 మీటర్ల ఎత్తు
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్‌
గ్యాస్‌ సబ్సిడీకి కోత రూ.44,647 కోట్లు
అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాల్సిందే..
27న కవిత పిటిషన్‌ విచారణ
భువనగిరికి బ్లాక్‌ లెవెల్‌ క్లస్టర్‌ మంజూరు చేయండి
కులాన్ని బట్టి శిక్ష?
బాణసంచా పరిశ్రమలో పేలుడు
మహాత్మాగాంధీ మనవరాలు గోకనీ మృతి
మోడీ మాటలకు అర్థాలే వేరులే...!
ఘనంగా పద్మ అవార్డుల ప్రదానం
బిల్కిస్‌ బానో కేసుపై సుప్రీం ప్రత్యేక బెంచ్‌
సురక్షిత నీరు రావట్లేదు.
సిసోడియా కస్టడీ పొడిగింపు
కేంద్ర ప్రభుత్వ దురహంకారమిది..

తాజా వార్తలు

01:20 PM

ప్రయాణికులకు అందుబాటులోకి కొత్త ఏసీ స్లీపర్ బస్సులు

01:10 PM

28న హైదరాబాద్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం

01:06 PM

కాంగ్రెస్‌లో చేరిన డీ.శ్రీనివాస్.. సొంత ఇంటికి వచ్చినట్లు

12:57 PM

రాహుల్ గాంధీ ఏం నేరం చేశారు : ప్రియాంక గాంధీ

12:41 PM

డేటా చోరీ కేసులో రంగంలోదిగిన ఆర్మీ..

12:29 PM

భారత వ్యతిరేక నిరసనలపై కేంద్రం సీరియస్...

12:29 PM

ప్రారంభమైన కాంగ్రెస్‌ పార్టీ సంకల్ప్‌ సత్యాగ్రహ నిరసన దీక్ష..

12:21 PM

పిడుగుపాటుకు 350కిపైగా మేకలు, గొర్రెలు మృతి..

12:19 PM

ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే తీగల వంతెన...

12:10 PM

ఇస్రో బృందానికి అభినందన‌లు తెలిపిన సీఎం జగన్‌

11:51 AM

సిట్ విచారణకు హజరుకాలేను : బండి సంజయ్‌

11:29 AM

రాహుల్‌కు మద్దతుగా దేశ వ్యాప్తంగా దీక్షలు..నిర‌స‌నలు

11:00 AM

నేను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డట్లు సజ్జల ఎలా తెలిసింది : రామనారాయణ రెడ్డి

10:47 AM

విజయవంతమైన ఇస్రో రాకెట్ ప్రయోగం..

10:26 AM

పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న వ్యక్తిపై దాడి..

10:13 AM

దారుణం వదినను రోకలిబండతో కొట్టి చంపిన మరిది..

10:00 AM

నింగిలోకి దూసుకెళ్లిన ఎల్‌వీఎం-3 నౌక ..

09:30 AM

అమెరికాలో భారత జర్నలిస్ట్‌పై ఖలిస్థానీ మద్దతుదారుల దాడి

09:11 AM

జూపార్కులో గుండెపోటుతో చీతా మృతి..

08:49 AM

ఏపీ మంత్రి సురేష్‌కి తప్పిన పెను పమ్రాదం..

08:35 AM

గాంధీ డిగ్రీపై వ్యాఖ్యపై స్పందించిన గాంధీ మునిమనవడు..

08:21 AM

నేడు డబ్ల్యూపీఎల్ ఢిల్లీ, ముంబై తుది పోరు..

07:58 AM

రాజస్థాన్‌లో స్వ‌ల్ప భూకంపం..

07:35 AM

జైలు నుంచి పెరోల్‌పై వచ్చి వివాహం చేసుకున్న యువకుడు..

07:09 AM

నేడు సిట్ ముందుకు బండి సంజయ్..!

10:48 AM

సీసీఎల్‌-2023 టైటిల్‌ను గెలుచుకున్న తెలుగు వారియర్స్‌

06:20 AM

దారుణం.. క్వారీలో డిటోనేటర్లు పేలి ఇద్దరు మృతి

06:10 AM

నీట్‌కు వ‌య‌స్సు అర్హతపై దాఖలైన పీటీష‌న్ నిరాకరించిన హైకోర్టు..

10:22 PM

RC15 సెట్ లో కేక్ కట్ చేసిన రామ్ చరణ్...

09:16 PM

రేపు శ్రీహరికోట నుంచి ఇస్రో వాణిజ్య రాకెట్ ప్రయోగం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.