Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కొలువు సవాల్‌ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Feb 01,2023

కొలువు సవాల్‌

- కష్టంగా మారిన నాణ్యమైన ఉద్యోగాల సాధన
- మహమ్మారి, లాక్‌డౌన్‌ పరిస్థితుల ప్రభావం
- దేశంలోని యువత, నిరుద్యోగులకు క్లిష్ట కాలం
- బడ్జెట్‌లోనైనా ఏదైనా పరిష్కారం చూపాలి
- ఆర్థిక నిపుణులు, విశ్లేషకుల సూచన
న్యూఢిల్లీ : దేశంలో ప్రతి రంగాన్ని కుదేలు చేసిన కరోనా మహమ్మారి సామాన్య ప్రజల నుంచి చిన్న వ్యాపారుల వరకు.. ప్రతి ఒక్కరికీ వివత్కర పరిస్థితులను చూపింది. మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా అమలు చేసిన లాక్‌డౌన్‌, పెద్ద నోట్ల రద్దు దుష్ప్రభావాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, దేశంలోని యువత కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ పరిస్థితుల ప్రభావం కారణంగా అప్పటి వరకు తమకున్న ఉద్యోగాలను కోల్పోయి నిరుద్యోగులుగా మారారు. దీంతో వారి ఆశలన్నీ అడడియాశలయ్యాయి. కరోనా ముందు వరకూ ఆర్థిక మందగమనంతో భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమనదశలో ఉన్నది. అయినప్పటికీ.. ఆ పరిస్థితుల్లోనూ దేశ యువత కొంత వరకు నిలదొక్కుకున్నారు. అయితే, కరోనానంతరం పరిణామాలు ఒక్కసారిగా వారి జీవితాలను తలకిందులుగా చేశాయి. ఆకర్షణీయమైన జీతాలు, ఒక స్థిరమైన హౌదాలో ఉన్న ఉద్యోగులందరిలో చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. అలాంటి ఉద్యోగులు బతుకు బండి నడవటం కరోనా కాలంలోనూ, ఇప్పటికీ.. తమకు సంబంధం లేని పనులను చేస్తున్నారు. కొందరు పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలతో నెట్టుకొస్తుంటే.. మరికొందరు ఉదయం నిద్ర లేచింది మొదలు.. అర్ధరాత్రి వరకు ఒకటికి పైగా ఉద్యోగాలను చేస్తున్న పరిస్థితులు కనబడ్డాయి.
''నేను హౌరాలోని మెటల్‌ వర్క్స్‌లో అకౌంటెంట్‌గా ఉద్యోగం చేసేవాడిని. అయితే, కరోనా పరిస్థితులతో ఆ ఉద్యోగం కోల్పోయాను. లాక్‌డౌన్‌ సమయంలో పోస్టా మార్కెట్‌కు సమీపంలోని ఉంటూ.. గోనె సంచులలో వ్యాపారం చేసే హౌల్‌సేల్‌ సంస్థలో పార్ట్‌టైమ్‌ పని చేస్తున్నాను. అలాగే, ఒక ఫుడ్‌కోర్టులో క్యాషియర్‌గా చేస్తున్నాను'' అని కోల్‌కతాలోని ఒక వ్యక్తి తెలిపాడు. అయితే, ఈ రెండు ఉద్యోగాల కారణంగా జీవిత నాణ్యత పడిపోయందని సదరు వ్యక్తి వాపోయాడు. ఎక్కువ పని గంటలు, ఆరోగ్యం, భవిష్యత్తుకు సంబంధించి భరోసా లేకుండానే ఈ ఉద్యోగాలను చేయాల్సి వస్తున్నదని చెప్పాడు. ఇతను మాత్రమే కాదు.. దేశంలోని చాలా మంది యువత, నిరుద్యోగుల పరిస్థితి ఇలాగే ఉన్నదని నిపుణులు, విశ్లేషకులు చెప్పారు. మహమ్మారి ప్రేరిత వ్యాపార మాంద్యం తర్వాత ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా పుంజుకోవడంతో ఉద్యోగాలు కొంత ఏర్పడ్డాయి. కానీ, ఆ ఉద్యోగాల నాణ్యత తరచుగా అస్పష్టంగా ఉన్నది. ఎందుకంటే వాటిలో ఎక్కువ భాగం అనధికారిక రంగంలో ఉన్నాయని నిపుణులు తెలిపారు. దేశంలోని చాలా మంది యువత ఇప్పటికీ ఉద్యోగాలు పొందలేక నిరుద్యోగులుగా మారుతున్నారని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉన్న నిరుద్యోగులకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించటం కష్టంగా తయారైందని అన్నారు. జనాభా పెరుగుదల, మహమ్మారి సమయంలో పనిని కోల్పోయిన వారితో జాబ్‌ మార్కెట్‌లో ఎక్కువ మంది కొత్తగా చేరటం, కేంద్రం నుంచి సరైన విధానాలు లేని కారణంగా ఉద్యోగ అవకాశాలు ఇప్పటికే చాలా తక్కువగా ఉన్నాయని నిపుణులు తెలిపారు.'' రెండు సంవత్సరాల కోవిడ్‌ -19 నుంచి కోలుకున్న పెద్ద కార్పొరేట్‌ల ద్వారా వృద్ధి ఎక్కువగా ఉన్నది. అయితే, సూక్ష్మ, చిన్న , మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) లేదా సెమీ ఫార్మల్‌ రంగం కొంత భాగం చనిపోయింది. కొంత భాగం రెండింతల నుంచి కోలుకోలేదు. పెద్ద నోట్ల రద్దు, మహమ్మారి దెబ్బ కారణంగానే ఇదంతా..'' అని ప్రఖ్యాత ఆర్థికవేత్త, జాతీయ గణాంక కమిషన్‌ మాజీ చైర్మెన్‌ ప్రణబ్‌ సేన్‌ వివరించారు. భారత్‌లో 2011-12లో 3 శాతం లోపు.. 2017-18లో ఆరు శాతం లోపు ఉన్న నిరుద్యోగం.. ప్రస్తుతం 8 శాతం దగ్గరకు చేరుకున్నదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే, తాజాగా ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లోనైనా నిరుద్యోగుల విషయంలో కేంద్రం ఏవైనా ఉపయోగపడే చర్యలు చేపట్టాలని సూచించారు. లేకపోతే దేశంలో నిరుద్యోగం తారాస్థాయికి చేరే ప్రమాదమున్నదని హెచ్చరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కరోనా కేసులు పెరుగుతున్నయ్‌
అది ఉగ్రవాద సంస్థ కాదు
మంగుళూరులో రెచ్చిపోయిన కాషాయ మూకలు
పిరికి ప్రధాని
ఉపాధి తగ్గింది
నా పేరు సావర్కర్‌ కాదు..గాంధీ
చిన్నారుల్లో పోషకాహారలోపం
ప్రజాస్వామ్య భావనపై దాడి
గుజరాత్‌ సీఎంఓ సీనియర్‌ అధికారి రిజైన్‌
పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌-లెఫ్ట్‌ కూటమి సత్తా
ప్రతిపక్షాల న్యాయ పోరాటం
40% పెరిగిన బ్యాంక్‌ ఎగవేతలు
ఆర్థిక బిల్లుకు లోక్‌సభ ఆమోదం
15 రోజుల్లోగా లొంగిపోండి : సుప్రీం
మోడీ సొంత రాష్ట్రంలో పెరిగిన పేదరికం
అదానీ కుంభకోణం నుంచి దృష్టి మరల్చేందుకే !
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
రాహుల్‌పై అనర్హత వేటు
రాహుల్‌కు జైలు
విప్లవ వీరులకు వందనం
పోలవరం మొదటి దశ 41.15 మీటర్ల ఎత్తు
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్‌
గ్యాస్‌ సబ్సిడీకి కోత రూ.44,647 కోట్లు
అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాల్సిందే..
27న కవిత పిటిషన్‌ విచారణ
భువనగిరికి బ్లాక్‌ లెవెల్‌ క్లస్టర్‌ మంజూరు చేయండి
కులాన్ని బట్టి శిక్ష?
బాణసంచా పరిశ్రమలో పేలుడు
మహాత్మాగాంధీ మనవరాలు గోకనీ మృతి
మోడీ మాటలకు అర్థాలే వేరులే...!

తాజా వార్తలు

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.