Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భౌతిక వాదాన్ని తవ్వితీసిన దేవీప్రసాద్‌ చట్టోపాధ్యాయ | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Nov 18,2022

భౌతిక వాదాన్ని తవ్వితీసిన దేవీప్రసాద్‌ చట్టోపాధ్యాయ

ఒకప్పుడు ప్రపంచానికి భౌతిక వాదం పరిచయం చేసిందే మనదేశం. ఇక్కడి చార్వాక-లోకాయత ఆలోచనా విధానాన్ని మనువాదులు అన్యాయంగా అణగదొక్కారు. భూస్థాపితం చేశారు. తమ కట్టుకథల్ని ప్రచారం చేసుకుని అదే మన సంస్కృతి, అదే మన సంప్రదాయం అని బుకాయించారు. అయినా భౌతిక వాదం ఎక్కడికీ పోలేదు. ఈనేలలోనే ఉంది. ఈ గాలిలోనే ఉంది. లోకాయత అంటే లోకేశు ఆయుతంః అని అర్థం. అంటే లోకంలో వ్యాప్తి చెందిన ప్రజల దృక్పథం - అని అర్థం! వీరు లోకాన్నే విశ్వసిస్తారు. ఎక్కడా లేని ఇతర లోకాలను నమ్మరు. లోకంలోని లోకులను మాత్రమే విశ్వసిస్తారు. లోకాయత ప్రజల తత్త్వ శాస్త్రం. ఆధునిక వైజ్ఞానిక పరిశోధనలు జరగక ముందే (బిసిఈ) లోకాయతులు ప్రపంచమే వాస్తవం అన్నారు. నాలుగైదు మూలకాల సంయోగం వల్లనే ఈ ప్రపంచం ఏర్పడిందన్నారు. నీరు, నిప్పు, గాలి, భూమి - నాలుగు మూలకాలయితే, అయిదోది ఆకాశం అన్నారు. చైతన్యం అనేది పంచ భూతాల నుండి వస్తుందన్నారు. 'భూతే బాహ్య చైతన్యం!' మనుషులందరి శరీరాలు ఒకటే - ముక్కు, ముఖం, చేతులు, కాళ్ళు అందరికీ ఒకేలా ఉన్నప్పుడు, జీవన క్రియలు ఒకేలా జరుగుతున్నప్పుడు ఈ వర్ణ వ్యవస్థ ఎందుకూ? ఈ కులాల తారతమ్యాలు ఎందుకూ? అసలు అవి ఉండాల్సిన అవసరం ఏమిటీ? అని లోకాయతులు సాధారణ శకానికి ముందే ప్రశ్నించారు. వీరే అతి ప్రాచీన భారతీయ భౌతికవాదులు. ఈ ప్రపంచాన్ని ఏ శక్తీ నడిపించడం లేదని, ఆత్మ, పునర్జన్మ మోక్షం వంటివి ఉండవని చాటి చెప్పారు.
1918-1993 మధ్య కాలంలో దేవీ ప్రసాద్‌ ఛటోపాధ్యాయ అనే మార్క్సిస్టు మేధావి, తత్వ్తవేత్త ముందుకొచ్చాడు. వైదిక ధర్మ ప్రచారకుల వేదాల అబద్దపు కట్టడాల్ని కూల్చివేస్తూ... వారు భూస్థాపితం చేసిన భారతీయ భౌతిక వాదాన్ని అదే భూమి పొరల్లోంచి తవ్వితీశాడు. ఒకప్పుడు దేశంలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న లోకాయత - చార్వాక తాత్వికతను దేశ ప్రజలకు విడమర్చి చెప్పాడు. వైదిక పురాణాలు ప్రచారం చేసిన భ్రమల్ని బద్దలు కొట్టాడు. అన్నింటికీ 'కారణం' - హేతువు ప్రధానమని, అది వైజ్ఞానిక అవగాహన మీద ఆధారపడి ఉండాలని చెప్పిన మహనీయుడాయన! తొలిసారి తత్త్వశాస్త్రాన్నీ, వైజ్ఞానికతనూ కట్టగట్టి కొత్త ఆలోచనలకు దారులు వేసిన పరిశోధకుడాయన! చరిత్రకు, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలకు సైన్సు వెన్నముక కావడం మనం చూశాం. కానీ, దేవీ ప్రసాద్‌ చట్టోపాధ్యాయ కొత్తగా ఫిలాసఫీకీ సైన్సుకూ ఉన్న సంబంధాన్ని హేతు బద్ధంగా చెప్పి - నిరూపించారు!
ప్రాచీన భారతీయ భౌతిక వాదాన్ని అధ్యయనం చేసి, ఆయన ప్రకటించిన 'లోకాయత' మాత్రమే కాదు, వైజ్ఞానిక శాస్త్రాల చరిత్రను (HISTORY OF SCIENCE), ప్రాచీన భారత దేశంలో వైజ్ఞానిక పద్ధతుల్ని (SCIENTIFIC METHODS IN ANCIENT INDIA) ఆయన గ్రంథాలుగా ప్రకటించారు. ఇవే కాకుండా ప్రాచీన భారతదేశంలో విజ్ఞాన శాస్త్రం - సమాజం (SCIENCE AND SOCIETY IN ANCIENT INDIA). వంటి గ్రంథాలు బహుళ ప్రజాదరణ పొందాయి.
ఆయన గ్రంథం లోకాయత (A STUDY IN ANCIENT INDIAN MATERIALISM) - 1959 దేశంలోనే కాదు, విదేశాల్లోనూ సంచలనం సృష్టించింది. భారతీయ మార్కిస్టు తాత్త్వికత గూర్చి ప్రపంచానికి ఒక కొత్త అవగాహనను కలిగించింది. దేవీ ప్రసాద్‌ ఛటోపాధ్యాయ (19 నవంబర్‌ 1918-8 మే 1993) రచనలు ''సైన్స్‌ అండ్‌ సొసయిటీ ఇన్‌ ఏన్సియంట్‌ ఇండియా'' - సంపుటాలు; ''వాట్‌ ఈజ్‌ లివింగ్‌ అండ్‌ వాట్‌ ఈజ్‌ డేడ్‌ ఇన్‌ ఇండియన్‌ ఫిలాసఫీ'', ''ట్రూ ట్రెండ్స్‌ ఇన్‌ ఇండియన్‌ ఫిలాసఫీ'', ''రిలిజియన్‌ అండ్‌ సొసయిటీ'' వంటి గ్రంథాలు తిరగేస్తే ఒకప్పుడు ప్రపంచానికి భౌతికవాదం బోధించిన భారతదేశం ఈ రోజు ఎందుకు ఇలా కుప్పగూలిపోయిందో అర్థమవు తుంది. అంతేకాదు, దాన్ని పునరుద్దరించుకోవాల్సిన బాధ్యత నేటియువతరం మీద ఎంత ఉందో అంచనా వేసుకోవడానికీ వీలవుతుంది. కార్యాచరణకు ప్రేరణలభిస్తుంది.
చార్వాకుడు ఒక నాటి రుషి. అతను ప్రపంచంలోనే మొట్టమొదటి సారి భౌతికవాదం గురించి ఆలోచించాడు. బృహస్పతి ఆ ఆలోచనకు ఒకరూపం ఇచ్చాడు. పైగా చార్వాకుడి పేరుతోనే ఆ ఆలోచనా విధానాన్ని 'చార్వాకం' అని అన్నాడు. మాధవాచార్య ఆ పదానికి అర్థం చెప్పాడు. చారూ అంటే తియ్యని అని, వాక్‌ అంటే మాట అని చెప్పాడు. యదార్థాల్ని సున్నితంగా చెప్పడం- అని కూడా మనం అనుకోవచ్చు. చార్‌వాక్‌కు మరొక అర్థం కూడా ఉంది. వారు ప్రతిపాదించినవి నాలుగు విషయాలు (నాలుగు వాక్కులు) గనక, వారి ఆలోచనా ధోరణిని 'చార్వాక' అని కూడా అన్నారు. 1. యావత్‌ జీవేతూ సుఖ్‌జీవేతూ (జీవితాంతం సుఖంగా జీవించు) 2. రుణమూ కృత్వా ఘృత పీవేతూ (అప్పు చేసైనా నెయ్యితాగు) 3. భస్మీ భూతస్య దేహస్య (కాలిపోయి బూడిద అయ్యే ఈ దేహం) 4. పునరాగమన కృతః (మళ్ళీ తిరిగి వస్తుందని ఎలా అనుకుంటావూ?) నెయ్యి తాగు - అంటే ఇక్కడ నెయ్యనే కాదు. పాలు, పెరుగు, శరీరానికి అవసరమైన పౌష్టికాహారం అని అర్థం. చనిపోయాక ఈ దేహం కాలిస్తే బూడిద అవుతుంది. పూడిస్తే మట్టి అవుతుంది. అంతేగాని ఇక పునరాగమనం ఎక్కడా? శరీరం ఎలా తిరిగివస్తుంది అని ప్రశ్నించారు. అంటే పునర్జన్మ అబద్దమనీ, అది ఉండదనీ చెప్పారు. మోక్షానికి కూడా ఆధారం లేదన్నారు.
శరీరమే ముఖ్యం. వైదికులు చెప్పే ఆత్మ ఉండాలన్నా కూడా శరీరం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి కదా? అప్పు చేసైనా సుఖంగా ఉండు - అని అన్నది ఎందుకంటే అప్పు తీసుకున్న వాడు, అప్పు ఇచ్చినవాడూ ఇద్దరూ ఏదో ఒకనాటికి నశించాల్సిన వాళ్ళే. కానీ జీవిని, ప్రాణాన్ని కష్టపెట్టకుండా కాపాడుకొమ్మని చార్వాకులు చెప్పారు. మిధ్యావాదాన్ని నమ్మగూడదని- అన్నారు. సంశయ వాదం, సందేహ వాదాన్ని ప్రమాణంగా తీసుకోలేదు. కర్మఫలం ఉండదు. స్నేహితులతో, బంధువులతో బతికినంత కాలం సంతోషంగా గడపడమే జీవితం! వారినందరినీ పక్కకు నెట్టి, ఎక్కడా లేని పరలోక సుఖాల కోసం పూజలు, యజ్ఞాలు చేయడం మూర్ఖుల లక్షణం- అని అన్నారు. తర్కాన్ని - అనుభవాన్ని - శరీరాన్ని మాత్రమే నమ్ముకోవాలి. అంతేగాని, ఆత్మను, పునర్జన్మను, స్వర్గనరకాలను, కర్మకాండను నమ్ముకోగూడదన్నది వారి సిద్ధాంతం! వైదిక ధర్మంలో యజ్ఞయాగాలకు, జంతు బలులకు చాలా ప్రాముఖ్యం ఉంది. ప్రకృతిని పరిరక్షించుకోవాలని భావించే చార్వాకులు / లోకాయతులు - పశువుల్ని, పక్షుల్ని ఇతర జీవ రాసుల్ని అమితంగా ప్రేమించేవారు. అందుకే జంతుబులుల్ని తీవ్రంగా అడ్డుకున్నారు. బలి ఇచ్చిన పశువులు స్వర్గానికి వేళ్ళేదైతే, ఈ వైదిక పండితులు వృద్ధాప్యంతో సతమతమయ్యే తమ తండ్రిని బలిచ్చి నేరుగా స్వర్గం పంపవచ్చు కదా? అని సవాలు విసిరారు. లోకాయతుల అర్థవంతమైన ప్రశ్నలకు జవాబు చెప్పలేక వైదిక ధర్మ బోధకులు వక్ర భాష్యాలు చెప్పి, అణగదొక్కారు. భౌతిక దాడులకు పూనుకుని చార్వాకుల్ని బానిసలుగా మార్చారు. ఆడవారిపై అత్యాచారాలు చేశారు. కుట్ర పూరితంగా వారి గ్రంథాల్ని సైతం నాశనం చేశారు. కాల్చేశారు. అందుకే చార్వాక-లోకాయుతలపై ప్రాచీన గ్రంథాలు మనకు దక్కలేదు.
దేవీ ప్రసాద్‌ ఛటోపాధ్యాయ లాంటి పరిశోధకుల కృషితో కొంతలోకొంత సమాచారం బయటికొచ్చింది. ఏది ఏమైనా 'నాస్తికో వేద నిందక' (నాస్తికులు వేదాలను నిందిస్తారు-ఒప్పుకోరు) అన్న భావన లోకంలో స్థిరపడింది.
చార్వాక - జ్ఞాన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. అంటే థియరీ ఆఫ్‌ నాలెడ్జ్‌ (EPISTEMOLOGY). ప్రత్యక్ష ప్రమాణాలుంటేనే దేనినైనా స్వీకరించాలని ఈ సిద్ధాంతం చెప్పింది. ప్రత్యక్ష అనుభవం అనేది రుచి, వాసన, స్పర్శ, దృష్టి, శబ్దం వల్ల గ్రహించొచ్చు. జ్ఞానేంద్రియాలకు అందని భ్రమలు - కల్పితాలు! అప్రత్యక్ష విశ్వాసాల్ని భౌతికవాదం పరిగణనలతరతోకి తీసుకోదు. చార్వాక ''థియరీ ఆఫ్‌ రియాలిటీ'' (METAPHYSICS)ని నమ్ముతుంది. గాలి, నీరు, అగ్ని, భూమితోనే ప్రతి పదార్థం రూపొందుతుంది గనక, ''పదార్థమే'' (MATTER) జీవనానికి ప్రధానం అన్నారు. 'మేటర్‌'ని గుర్తిస్తుంది గనక, ఈ సిద్ధాంతం ''మెటీరియలిజం'' అయ్యింది. జీవించి ఉన్న ప్రాణిలోని స్పృహ (CONSCIOUSNESS)ను వైదిక ధర్మం ''ఆత్మ'' అని భావించింది తప్పితే - ఆత్మ అనేది లేదన్నది చార్వాకులు గట్టిగా చెప్పారు.
ఒక రకంగా చార్వాక - లోకాయత అనేది భారతీయ తాత్త్విక దృక్పథంలో ప్రధానమైంది. ప్రపంచానికే తొలిసారి భౌతికవాదం గురించి చెప్పిన దేశం మన భారతదేశం. ఆ విషయం భారతీయులందరూ సగర్వంగా చెప్పుకోవాల్సింది పోయి, మనువాదుల చేతుల్లో కీలుబొమ్మలై, కల్పనల్లో ఊహించుకున్న దేవీ దేవతల మూర్తులకు పూజలు చేస్తూ దిగజారిపోయ్యారు. నిజాలను వదిలి, అబద్దాల వెంట పరుగులు పెట్టారు. అలా శతాబ్దాలు గడిచిపోయ్యాయి. మధ్య మధ్యలో దేవీ ప్రసాద్‌ ఛటోపాధ్యాయ లాంటి వివేకవంతులు ఆధునిక కాలంలో కూడా భౌతికవాద ప్రాశస్త్యాన్ని ఎలుగెత్తి చెపుతూనే ఉన్నారు. కానీ, కళ్ళు మూసుకుని, తలవంచుకని గొర్రెల్లా బతికే జనం వారి హెచ్చరికల్ని పట్టించుకోలేదు. శూన్యాన్ని మహాశక్తిగా విశ్వసిస్తూ వస్తున్నారు.
'దేబీదా'గా ప్రేమగా పిలవబడ్డ దేవీ ప్రసాద్‌ ఛటోపాధ్యాయ చదువుకునే రోజుల్లో డిగ్రీలోనూ, పిజిలోనూ గోల్డ్‌ మెడల్స్‌ సంపాదించారు. తత్త్వశాస్త్ర విద్యార్థిగా, అధ్యాపకుడిగా ఒక కొత్త ఒరవడి సృష్టించినందుకు చివరిదశలో ఆయనను ఒక సైన్స్‌ సంస్థ 'గెస్ట్‌ సైంటిస్ట్‌'గా సగౌరవంగా నియమించుకుంది. న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, టెక్నాలజీ అండ్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌లో కొంతకాలం ఉన్నారు. ఇది చాలా చాలా అరుదైన విషయం! భారత ప్రభుత్వం ఆయన కృషిని గుర్తించి, ఆయన మరణించిన తర్వాత ఐదేండ్లకు 1998లో పద్మభూషణ్‌ ప్రకటించింది. ఆయన కృషి వృధాగాపోలేదు.
సమకాలీనంలో పరిస్థితులు చాలా ప్రమాదకరంగా తయారయ్యాయి. అయితే, ఈ పరిస్థితి తప్పకుండా మారుతుంది. రాగల కాలాలలో యువత బుద్ధుడు చెప్పిన ''అత్‌ దీపోభవ' (నీవే దీపానివి అయిపో) అన్న మాటని గుండెల్లో నింపుకుని, వైజ్ఞానిక భౌతిక-మానవ వాదానికి దారులు వేస్తారు. తప్పదు!!

- డాక్టర్‌ దేవరాజు
మహారాజు
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రష్యా-జర్మనీలను శాశ్వత శత్రుదేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం!
మీడియా స్వేచ్ఛకు భంగం
అమెరికా ఏకధృవ ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు
పలక పగిలిపోయింది
''అద్దె సరుకులు'' - సామ్రాజ్యవాదం
మారుతున్న ఉపాధి సంబంధాలు
'ఫేక్‌' ఉత్తర్వులతో సోషల్‌ మీడియాపై కత్తి
''పుష్ప విలాపం''
త్యాగం చేద్దాం రారండి..
చేదు గుళికలు
హాట్సాఫ్‌..!
గవర్నర్‌ ప్రసంగం రాజ్యాంగబద్ధమైనది
ప్రయివేటుతో అభివృద్ధి... ఉద్యోగాలు సాధ్యమేనా?
బడ్జెట్‌ ఎవరి కోసం?
'ఆన్‌లైన్‌' డిబెట్‌
ఎవరు దేశభక్తులు? ఎవరు దేశద్రోహులు?
దారిదీపం
పొంచివున్న ఆర్థిక హింస
రవాణా కార్మికుల సంఘర్ష యాత్ర - అనుభవాలు
రాజ్యాంగ పతనంలో రాజకీయుల పాత్ర
కేజీబివీలలో బోధనేతర సిబ్బంది బాధలు తీరేదెపుడు?
జిన్‌, జియాన్‌, ఆజాదీ - ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా!
ధనవంతులదేనా భారతం..!
ప్రపంచంలో భారత్‌ స్థానం ఎక్కడీ
ఆడబిడ్డల్ని బతకనిద్ధాం
నువ్విక్కడ... నేనక్కడ...
వెంకన్న రాలే..!
ప్రజాసంక్షేమం - వక్రభాష్యాలు
నేతాజీ వారసత్వాన్ని దొంగిలించ గలరా?
మహాసమీకరణ - లౌకికశక్తుల ఏకీకరణ

తాజా వార్తలు

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

01:44 PM

బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట...

01:33 PM

బడ్జెట్‌లో మహిళలకు ప్రత్యేక పథకం..

01:18 PM

కొత్త‌ ఫిష్ క్యాంటీన్ ను ప్రారంభించిన‌ మంత్రి త‌ల‌సాని..

01:12 PM

భారీ లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు..

01:06 PM

కేజీ టు పీజీ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

05:21 PM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.