Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అప్పులే ఆదాయ వనరులా! | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Nov 19,2022

అప్పులే ఆదాయ వనరులా!

దేశంలోని 27 రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమైన 201 మున్సిపల్‌ కార్పొరేషన్ల ఆదాయ వ్యయాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధ్యయనం చేసి ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. దేశంలో ఉన్న పట్టణ, స్థానిక సంస్థలు ఆర్థిక వనరులను పెంచుకోవటానికి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను సూచించింది. వివిధ రకాల అప్పులు సమకూర్చు కోవటం ద్వారా పట్టణ, స్థానిక సంస్థలు ఆదాయ వనరుల కొరతను అధిగమించవచ్చన్నది అందులో ముఖ్యమైనది.
మొదటగా దేశంలో పట్టణ స్థానిక సంస్థల ప్రస్తుత పరిస్థితిని ఆర్‌బీఐ సమీక్షించి నివేదికలో పేర్కొంది. దేశంలో పట్టణీకరణ వేగంగా పెరుతున్నదని, ప్రపంచంలో 2035 నాటికి అత్యంత వేగంగా పెరుగుతున్న అతి పెద్ద నగరాల్లో భారతదేశంలోని 17 నగరాలు ఉంటాయని తెలిపింది. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను పట్టణ స్థానిక సంస్థలు ప్రజలకు కల్పించలేక పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
1992లో చేసిన 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం పట్టణ, స్థానిక సంస్థలకు దఖలు పడిన 18 రకాల అధికారాలు, విధులు, నిధులకు నేటికీ స్వయంప్రతిపత్తి కల్పించలేదు. అనేక అధికారాలు ఇప్పటికీ బదిలీ కాలేదని నివేదికలో చెప్పింది. రాష్ట్రాల స్థాయిలో రాష్ట్ర ఆర్థిక సంఘాలు క్రమం తప్పకుండా ఐదేళ్లకు ఒకసారి నియమించక పోవడం, కమిటీ ఇచ్చిన సిఫార్సులను సంవత్సరాల తరబడి ఆమోదించడం లేదని, ఆమోదించిన సిఫార్సులలో కూడా అనేక కోతలు పెడుతున్నారని తెలిపింది. ఇటీవల కాలంలో రాష్ట్రాల బడ్జెట్‌ల నుండి పట్టణ, స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపు బాగా తగ్గిపోయిందని కూడా నొక్కిచెప్పింది.
దేశంలో మున్సిపల్‌ సంస్థ ఆదాయాలు స్తంభించిపోయాయని, దేశంలోని మొత్తం పట్టణ సంస్థల ఆదాయం దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఒక శాతం లోపుగానే ఉందని నివేదిక విమర్శించింది. ఇతర దేశాల మున్సిపల్‌ సంస్థల బడ్జెట్లతో చూసినప్పుడు సైతం మన దేశంలోని మున్సిపాలిటీల బడ్జెట్ల పరిమాణం నామమాత్రంగా కూడాలేదు. ప్రపంచంలోని అతి చిన్న దేశాలైన బ్రెజిల్‌లో 7.4శాతం, దక్షిణాఫ్రికాలో 6శాతం (జీడీపీలో స్థానిక మున్సిపల్‌ సంస్థల ఆదాయాలు) ఉన్నాయని తెలిపింది. రెండోవైపు దేశంలో మున్సిపల్‌ సంస్థల పన్ను, పన్నేతర సొంత ఆదాయాలు కూడా పెద్దగా పెరగటం లేదని చెప్పింది. ఫలితంగా దేశంలో అన్ని మున్సిపల్‌ సంస్థలు రోజురోజుకి కేంద్ర, రాష్ట్ర గ్రాంట్ల మీదే ఆధారపడు తున్నాయని, వీటి నుండి వచ్చే నిధులు కూడా స్వల్పంగా ఉన్నాయని తెలిపింది.
2017-20 మధ్యకాలంలో 201 మున్సిపల్‌ కార్పొరేషన్ల ఆదాయ వ్యయాలను ఆర్‌బీఐ పరిశీలన చేసింది. ఈ సంస్థల్లో పన్ను, పన్నేతర ఆదాయాలు ఆయా పట్టణాలు పెరుగుతున్న స్థాయిలో పెరగటంలేదు. ఫలితంగా నిధుల కొరతతో ఆ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించలేక పోతున్నాయని నిర్థారించింది. కనుక దేశంలో ఉన్న పట్టణ మున్సిపల్‌ సంస్థలు కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌ల మీద ఆధారపడకుండా తమ ఆదాయాలు పెంచుకొని మౌలిక సదుపాయాలు అభివద్ధి చేయాలని సూచించింది.
ఇందులో మొదటిది వివిధ రకాల మున్సిపల్‌ బాండ్ల రూపంలో నిధులు సమకూర్చుకోవాలని తెలిపింది. ఇప్పటికే ఈ సదుపాయం ఉన్నప్పటికీ దేశంలో అత్యధిక మున్సిపల్‌ సంస్థలు బాండ్ల ద్వారా అప్పులు సేకరించటంలేదని పేర్కొంది. ఇప్పుడు బాంబే స్టాక్‌ మార్కెట్‌ లేదా నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లలో మున్సిపల్‌ సంస్థలు నమోదై నిధులు సమకూర్చుకోవాలి. అలాగే క్రెడిట్‌ రేటింగ్‌ వ్యవస్థను అన్ని మున్సిపల్‌ సంస్థలలో అమలు చేయటం ద్వారా మున్సిపల్‌ సంస్థల ఆర్థిక క్రమశిక్షణ పని తీరును మెరుగు పరచవచ్చని తద్వారా ప్రతి నగరం లేదా పట్టణం మెరుగైన క్రెడిట్‌ రేటింగ్‌ ర్యాంకులు పొంది ఎక్కువ అప్పులు సమీకరించుకోవచ్చని తెలిపింది.
పన్ను, పన్నేతర సొంత ఆదాయాలు బాగా పెంచుకోవాలని రెండో అంశంగా సూచించింది. ఆస్తిపన్ను మదింపుపై, పన్నేతర ఆదాయాలపై గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను అన్ని మున్సిపల్‌ సంస్థల్లో అమలు చేయాలని పేర్కొన్నది. మొత్తంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక సారాంశం ఏమిటంటే పట్టణ మున్సిపల్‌ సంస్థలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు, నిధులపై ఆధారపడ కూడదని తేల్చి చెప్పింది. తమ పరిధిలో ఉన్న పన్ను, పన్నేతర సొంత ఆదాయాలను పెంచుకోవాలని, బాండ్ల రూపంలో అప్పులు సమీకరించుకోవటంతో పాటు, మౌలిక సదుపాయా లను ప్రయివేటీకరించుకోవడం ద్వారా ఆర్థిక భారాలను తగ్గించుకోవచ్చునని ప్రస్తుత మున్సిపల్‌ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా చెప్పింది. ఈ నివేదికలో పేర్కొన్న అంశాలు, సిఫార్సులు చాలా ప్రమాదకరమైనవి. పట్టణ మున్సిపల్‌ సంస్థలు కేంద్ర రాష్ట్ర గ్రాంట్ల మీద ఆధారపడకూడదనేది ప్రపంచ బ్యాంకు సిద్ధాంతం. గత రెండు దశాబ్దాలకు పైగా పట్టణ సంస్కరణలను దేశంలో అమలు చేస్తున్నారు. ఇప్పుడు వీటిని వేగవంతం చేయటానికి కేంద్ర బిజెపి సర్కార్‌ రకరకాల కమిటీలు, నివేదికల పేర పూనుకుంది.
బాండ్ల ద్వారా మున్సిపల్‌ సంస్థలు నిధులు సేకరించడం అనే ప్రక్రియ రెండు దశాబ్దాల కిందటే ప్రారంభమైంది. గతంలో పెద్దపెద్ద మున్సిపల్‌ కార్పొరేషన్లు పెద్దపెద్ద ప్రాజెక్టులు చేపట్టినప్పుడు తమ భూములను ప్రభుత్వ బ్యాంకులలో తనఖా పెట్టి అప్పులు తీసుకునేవి. ఇప్పుడు మున్సిపల్‌ సంస్థలు స్టాక్‌ మార్కెట్లలో నమోదై ప్రయివేటు ఏజెన్సీల నుండి నిధులు సమకూర్చుకోవాలనేది ప్రపంచబ్యాంకు ఆదేశం. అలాగే వివిధ రకాల బాండ్లు విడుదల చేసి ప్రయివేటు సంస్థల నుండి అప్పులు సమకూర్చు కోవాలి. ఈ పద్ధతిలో నిధులు సమకూర్చుకునే మున్సిపల్‌ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కొన్ని రాయితీలు కూడా ప్రకటించింది. ఉదాహరణకు స్టాక్‌ మార్కెట్ల ద్వారా రూ.100కోట్లు అప్పు సేకరించుకుంటే ఆ మున్సిపల్‌ సంస్థకు రూ.13కోట్లు ఇన్‌సెంటివ్‌గా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది.
అయితే స్టాక్‌ మార్కెట్ల ద్వారా, ప్రయివేటు ఏజెన్సీల ద్వారా అప్పులు పొందాలంటే ముందుగా క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థల ద్వారా మున్సిపల్‌ సంస్థల ఆర్థిక తీరుపై మదింపు జరగాలి. అప్పులు పొందే అర్హతలు ఈ సంస్థలకు ఉన్నాయా? లేదా? అనేది నిర్థారణ జరగాలి. ఆ తర్వాత క్రెడిట్‌ రేటింగ్‌ 'ఎఎఎ' నుండి 'డి' వరకు ఇస్తారు. ఇటీవల 364 స్మార్ట్‌ సిటీలు, అమత నగరాలు క్రెడిట్‌ రేటింగ్‌ పొందాయి. అయితే వీటిలో 144 సంస్థలు మాత్రమే అప్పుకు అర్హత పొందాయి. ప్రయివేటీకరణ విధానాలు అన్ని రంగాల్లో అమలు చేసే వాటికి, ప్రజల నుండి పౌరసేవలకు పెద్ద మొత్తంలో యూజర్‌ ఛార్జీలు వసూలు చేసే మున్సిపల్‌ సంస్థలకు మొదటి శ్రేణి ర్యాంకులు ఇస్తారు. ప్రయివేటీకరణ విధానాలు అమలు చేయని మున్సిపల్‌ సంస్థలకు క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలు అప్పులకు అర్హత కలిగిన ర్యాంకులు ఇవ్వవు. ఇదంతా ఒక పెద్ద తంతు. క్రెడిట్‌ రేటింగ్‌ల ప్రధాన ఉద్దేశం...పౌరసేవలను ప్రయివేటీక రించటం, మౌలిక సదుపాయాల కల్పనలో పట్టణ స్థానిక సంస్థల పాత్ర తగ్గించుకోవడం లేదా వైదొలగి ప్రయివేట్‌ సంస్థలకు ధారాదత్తం చేయడం.
మరోవైపు ప్రపంచ బ్యాంకు, ఏడిబి, డిఎఫ్‌ఐఎ, యు.ఎస్‌.ఎయిడ్‌ వంటి సంస్థలన్ని నేడు మన దేశ పట్టణ, స్థానిక సంస్థలలో ప్రత్యక్ష జోక్యం చేసుకుంటున్నాయి. నిధుల సహకారం పేర పౌరసేవలను ప్రయివేటీకరించాలని షరతులు విధిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా పట్టణ స్థానిక సంస్థలను అప్పుల్లోకి దించటానికి ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయాలని చాలా కాలం నుండి ఒత్తిడి చేస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పట్టణ మౌలిక సదుపాయాలకు సమీకృత పెట్టుబడి, సిటీ ఛాలెంజ్‌ ఫండ్‌ వంటి సంస్థలను ఏర్పాటు చేసింది. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలు పట్టణ స్థానిక సంస్థల అప్పుల కోసం అనేక సంస్థలను ఏర్పటు చేశాయి. కేంద్ర ఆర్థిక సంఘం నిధుల ద్వారా పట్టణ స్థానిక సంస్థలలో అనేక రకాల సంస్కరణలు అమలు జరుగుతున్నాయి. అంతేకాక కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన జవహర్‌లాల్‌ నెహ్రూ అర్బన్‌ రెన్యువల్‌ మిషన్‌, స్మార్ట్‌ సిటీ, అమృత పథకాల ద్వారా కూడా ప్రయివేటీకరణ విధానాలను పట్టణాలలో అమలు చేస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ పేర పారిశుధ్య నిర్వహణలో ప్రయివేటీకరణ కోసం నగరాలకు ర్యాంకులను ప్రకటించే పద్ధతి తీసుకొచ్చారు. పట్టణ ప్రణాళికా వ్యవస్థను బడా వ్యాపార వాణిజ్య సంస్థల ప్రయోజనాలకు అనుగుణంగా మార్చేస్తున్నారు.
కోవిడ్‌ను ఆసరా చేసుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే అప్పులకు... పట్టణ సంస్కరణలకు ముడిపెట్టింది. అనేక రాష్ట్రాలు కేంద్రానికి లొంగి ఈ సంస్కరణలను అమలు చేస్తున్నాయి. వాస్తవంగా పట్టణ రంగం రాష్ట్ర జాబితా లోనిది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర జాబితాలోని అనేక రంగాలను తన పరిధిలోకి బలవంతంగా గుంజుకుంటున్నది. దేశవ్యాప్తంగా పట్టణ రంగంలో ప్రయివేటీకరణ విధానాలను అమలు చేయటానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. ఏకపక్షంగా మున్సిపల్‌ సంస్థలకు సంబంధించిన అనేక చట్టాలను మార్చేసింది. మున్సిపల్‌ పరిధిలో ఉన్న కొన్ని పన్నులను కూడా జీఎస్‌టీలో కలిపి మున్సిపల్‌ సంస్థల ఆదాయానికి గండి కొట్టింది. దేశ పట్టణ వ్యవస్థపై కార్పొరేట్‌శక్తుల దోపిడి పెంచటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. అందులో భాగమే ఈ నివేదికలు.

- డా||బి.గంగారావు

  9490098792

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రష్యా-జర్మనీలను శాశ్వత శత్రుదేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం!
మీడియా స్వేచ్ఛకు భంగం
అమెరికా ఏకధృవ ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు
పలక పగిలిపోయింది
''అద్దె సరుకులు'' - సామ్రాజ్యవాదం
మారుతున్న ఉపాధి సంబంధాలు
'ఫేక్‌' ఉత్తర్వులతో సోషల్‌ మీడియాపై కత్తి
''పుష్ప విలాపం''
త్యాగం చేద్దాం రారండి..
చేదు గుళికలు
హాట్సాఫ్‌..!
గవర్నర్‌ ప్రసంగం రాజ్యాంగబద్ధమైనది
ప్రయివేటుతో అభివృద్ధి... ఉద్యోగాలు సాధ్యమేనా?
బడ్జెట్‌ ఎవరి కోసం?
'ఆన్‌లైన్‌' డిబెట్‌
ఎవరు దేశభక్తులు? ఎవరు దేశద్రోహులు?
దారిదీపం
పొంచివున్న ఆర్థిక హింస
రవాణా కార్మికుల సంఘర్ష యాత్ర - అనుభవాలు
రాజ్యాంగ పతనంలో రాజకీయుల పాత్ర
కేజీబివీలలో బోధనేతర సిబ్బంది బాధలు తీరేదెపుడు?
జిన్‌, జియాన్‌, ఆజాదీ - ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా!
ధనవంతులదేనా భారతం..!
ప్రపంచంలో భారత్‌ స్థానం ఎక్కడీ
ఆడబిడ్డల్ని బతకనిద్ధాం
నువ్విక్కడ... నేనక్కడ...
వెంకన్న రాలే..!
ప్రజాసంక్షేమం - వక్రభాష్యాలు
నేతాజీ వారసత్వాన్ని దొంగిలించ గలరా?
మహాసమీకరణ - లౌకికశక్తుల ఏకీకరణ

తాజా వార్తలు

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

01:44 PM

బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట...

01:33 PM

బడ్జెట్‌లో మహిళలకు ప్రత్యేక పథకం..

01:18 PM

కొత్త‌ ఫిష్ క్యాంటీన్ ను ప్రారంభించిన‌ మంత్రి త‌ల‌సాని..

01:12 PM

భారీ లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు..

01:06 PM

కేజీ టు పీజీ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

05:21 PM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.