Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రాజ్యాంగ లక్ష్యాలను రక్షించుకోవాలి | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Nov 26,2022

రాజ్యాంగ లక్ష్యాలను రక్షించుకోవాలి

నేడు దేశవ్యాపితంగా కేంద్ర బీజేపీ సర్కార్‌ ఓవైపు రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహిస్తూనే, మరోవైపు రాజ్యాంగ మౌలిక పునాదులను గడ్డపారతో తవ్వి పెకిలిస్తోంది. బీజేపీ మతోన్మాద కబంధ హస్తాల కింద మన రాజ్యాంగం నలిగి పోతోంది. రాజ్యాంగానికి మూల స్తంబాలుగా ఉన్న ప్రజస్వామ్యం, లౌకికవాదం, ఫెదరలిజం, సామాజిక న్యాయాలనే రాజ్యాంగ లక్ష్యాలను సమాధి చేస్తోంది. పార్లమెంట్‌లో ఎలాంటి చర్చ జరుపకుండానే అప్రజాస్వామికంగా తమకు ఉన్న మందబలంతో పేద లకు నష్టం చేసే అనేక బిల్లులను ఆమోదించు కుంటోంది. నూతన విద్యా విధానం 2021 బిల్లును ఆమోదించింది. ప్రజాస్వామిక గొంతులపై ఉక్కుపాదం మోపుతూ 'ఊపా' వంటి నిరంకుశ చట్టాలు తీసుకొచ్చింది. 80ఏండ్ల కురువృద్ధుడైన వరవరరావు వికలాంగుడైన ప్రొఫెసర్‌ సాయిబాబాలకు నాగ్‌పూర్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసినా సుప్రీంకోర్టు ఆ బెయిల్‌ను నిరాకరిస్తోంది. మేధావులు కల్బుర్గి ఫన్సారే, దబోల్కర్‌ గౌరీలంకేశ్‌ వంటి వారిని కూడా ఈ కాలమే పొట్టనబెట్టుకుంది. ప్రశ్నిస్తూ వార్తలు రాసినందుకు సుమారు 25మంది జర్నలిస్టులు హత్యగావించబడ్డారు. ఇవన్నీ భారత ప్రజాస్వామ్యాన్ని బలిచేస్తున్న ఘటనలలో కొన్ని మచ్చుతునకలు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370ని తొలగించి జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేసిందీ ప్రభుత్వం. అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టి లౌకిక స్ఫూర్తిని దెబ్బతీసింది. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ రాష్ట్రాల హక్కులను కాలదన్నుతోంది. సామాజిక న్యాయం అనే భావం స్థానంలో సామాజిక సామరస్యం పేరుతో చాతుర్వర్ణ వ్యవస్థలను పదిలంగా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే వారి లక్ష్యాలకు అడ్డుగా ఉన్న భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి దాని స్థానంలో మనుధర్మాన్ని ప్రవేశ పెట్టడానికి కుట్రలు చేస్తోంది.
నేటి మన రాజ్యాంగం మన దేశ ప్రజలకు ఏ మాత్రం వర్తించదని, దానిని రద్దు చేయడం ప్రతీ హిందువు లక్ష్యం కావాలని, అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం ఒక సొట్ట లాంటిదని, సుదీర్ఘ కాలం ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఫ్‌ు చాలక్‌గా పని చేసిన ఎంఎస్‌ గొల్వల్కర్‌ 1967 జనవరి 2న తమ అధికార పత్రిక అయిన ఆర్గనైజర్‌లో స్పష్టంగా రాశారు. వారి ఆదిగురువుల లక్ష్యాల కనుగుణంగా నేటి రాజ్యాంగ రద్దుకు ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధమవుతున్నది. ఇప్పటికే వారి కాషాయ ఎజెండా హిందూత్వ లక్ష్యంగా ఓ నూతన ప్రణాళికను డ్రాప్ట్‌ చేసి ఉంచింది. దాని లక్ష్యం తిరిగి మధ్యాయుగాల నాటి వెనుకబాటు మూఢత్వ పద్ధతులు అమలు చేయడం, చాతుర్‌ వర్ణధర్మాలు తిరిగి ప్రవేశ పెట్టడడమే. మన రాజ్యాంగానికి 73ఏండ్లు నిండాయి. ఇప్పటికే105 సార్లు సవరణలు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను సమీక్షించాలనే రాగమెత్తుతోంది. మొదటిసారి 13రోజుల ప్రధానిగా పనిచేసిన వాజ్‌పారు కాలంలోనే ఈ చర్చను లేవనెత్తారు. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. బీజేపీ మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రస్తుత సర్‌ సంఫ్‌ు చాలక్‌గా ఉన్న మోహన్‌ భగవత్‌ సైతం రిజర్వేషన్లను రాజ్యాంగాన్ని సమీక్షించాలని పలుమార్లు ప్రస్తావించారు. చివరికి నిజమాబాద్‌ బీజేపీ ఎంపీ అరవింద్‌ కూడా మాకు పార్లమెంట్‌లో బలం ఉంది, బాజాప్తా భాజపా రాజ్యాంగాన్ని మారుస్తుంది అని చెప్పాడు. అవి కేవలం ఎంపీ అరవింద్‌ మాటలు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అవి ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీల ఆలోచనలు అనేది మనం గుర్తించాలి.
భారత రాజ్యాంగం మన పార్లమెంట్‌ చేసిన శాసనం కాదు. రాజ్యాంగ సభ నిర్మాణం చేసిన ఒక గొప్ప లిఖితపత్రం. ఇదే మన భారత దేశ సంవిధానం. 2006 జూన్‌ నాటికి 444ఆర్టికల్స్‌, 12 షెడ్యూల్స్‌తో పాటు 26 భాగాలున్నాయి. వీటిలో 3, 4 భాగాలు మన రాజ్యాంగానికి గుండెకాయలు. 3వ భాగం పౌరుని ప్రాథమిక హక్కులు తెలియజేస్తే, 4వ భాగం ప్రభుత్వం సాధించాల్సిన లక్ష్యాలను తెలియజేస్తుంది. రాజ్యాంగంలో ప్రవేశిక, ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు, రిజర్వేషన్లు వంటి 4 ముఖ్యమైన నిబంధన లున్నాయి. ప్రవేశిక ప్రాణం వంటిది. భారతదేశాన్ని సర్వ సత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా రూపొందిం చడానికి భారత దేశంలో ఉన్న ప్రజలందరూ కులాలు మతాలు ప్రాంతాలు బాషా బేధం లేకుండా కంకణబద్ధులు కావాలని ప్రవేశిక ప్రకటించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 నుండి19 ప్రకారం అన్ని రకాల వివక్ష, నిషేధం, అంటారానితనాలు అమానుషం, చట్టం ముందు అందరూ సమానులే. కానీ ఆచరణలో జరిగుతుందేమిటి?
73ఏండ్ల రాజ్యాంగం అమలు తర్వాత కూడా నేటికీ దళితులు 116 రకాల వివక్ష రూపాలను ఎదుర్కొంటున్నారు. సామూహిక సంబరాల్లో పాల్గొననివ్వరు. ఎస్సీ ఉద్యోగులు సైతం క్లాసు వివక్ష ఎదుర్కొంటున్నారు. విడిసిల పేరుతో సాంఘిక బహిష్కరణలు, కులదురహంకార హత్యలు, దళిత స్త్రీలపై గ్యాంగ్‌ రేప్‌లు కోకొల్లలుగా కొనసాగుతున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 8ఏండ్ల కాలంలో మరింత అమానుషమైన వివక్ష కొనసాగుతోంది. నవంబర్‌ 18న కర్నాటక రాష్ట్రంలోని హెగ్గోటర అనే గ్రామంలో దళిత మహిళ వాటర్‌ ట్యాంక్‌లో మంచినీళ్లు తాగిందని, ఆ వాటర్‌ ట్యాంక్‌ మలినమైందని మనువాదులు పెత్తందారులు ఆవు మూత్రంతో పరిశుభ్రం చేశారు. రాజస్థాన్‌లో ఓ విద్యార్థి పాఠశాలలో కుండలో ఉన్న మంచినీళ్లు తాగాడాని ఆ విద్యార్థిని టీచర్‌ చితకబాది హత్యగావించాడు. యూపీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ ఎవరైనా దళితులు తనని కలవాలంటే షాంపూలతో తలస్నానం చేసి రావాలని చెపుతున్నారు! 2019లో యూపీ హత్రాస్‌లో గ్యాంగ్‌ రేప్‌ ఉదంతానికి పాల్పపడిన నింధితులని బీజేపీ రక్షించిన తీరు సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. ఇదేనా దళితుల పట్ల బీజేపీ విధానం? మన రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలు ఎటువైపు పయనిస్తున్నాయి. ఇలాంటి దారుణ అమానుష ఘటనలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లెక్కలేనన్ని జరిగాయి, జరుగు తున్నాయి. ఓ వైపు శాస్త్రసాంకేతిక రంగం ఆకాశం ఎత్తున అభివృద్ధి చెందుతుంటే మరో వైపు దళితులపై మధ్యయుగాల నాటి మానసిక చట్టాల శిక్షలు, కులవివక్షలు, దేశవ్యాప్తంగా దాడులు 300రేట్లు పెరిగాయి.
ఈ దేశం మతంతో సంబంధంలేని లౌకిక రాజ్యాంగంగా ఉంటుందని మన రాజ్యాంగం వాగ్దానం చేసింది. కానీ నేడు కేంద్ర బీజేపీ సర్కార్‌ ప్రతి అంశంలో రాజ్యాంగ స్ఫూర్తిని వదిలేసి, మతపరమైన వైషమ్యాలు రెచ్చగొడు తోంది. మతాన్ని రాజకీయాలతో పులమడం అంటే మతోన్మాద హింసను పెంచడమే. రాజ్యాంగం స్థానంలో మనుధర్మాన్ని ప్రవేశ పెట్టాలీ, త్రివర్ణ పతాకం స్థానంలో కాషాయ జెండాను ఢిల్లీ కోటపై ఎగరేయాలీ అన్న ఆర్‌ఎస్‌ఎస్‌ కలలను సాకారం చేయడమే బీజేపీ ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది. ఇది మన రాజ్యాంగ నియమాలనూ, సమాఖ్య స్పూర్తినీ విచ్ఛిన్నం చేస్తుంది. నేటి యువతరం రాజకీయాల కతీతం గా రాజ్యాంగ రక్షణకు సైనికులుగా సిద్ధం కావాలి.
(నేడు రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం)

- టి. స్కైలాబ్‌ బాబు
  సెల్‌:9177549646

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రష్యా-జర్మనీలను శాశ్వత శత్రుదేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం!
మీడియా స్వేచ్ఛకు భంగం
అమెరికా ఏకధృవ ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు
పలక పగిలిపోయింది
''అద్దె సరుకులు'' - సామ్రాజ్యవాదం
మారుతున్న ఉపాధి సంబంధాలు
'ఫేక్‌' ఉత్తర్వులతో సోషల్‌ మీడియాపై కత్తి
''పుష్ప విలాపం''
త్యాగం చేద్దాం రారండి..
చేదు గుళికలు
హాట్సాఫ్‌..!
గవర్నర్‌ ప్రసంగం రాజ్యాంగబద్ధమైనది
ప్రయివేటుతో అభివృద్ధి... ఉద్యోగాలు సాధ్యమేనా?
బడ్జెట్‌ ఎవరి కోసం?
'ఆన్‌లైన్‌' డిబెట్‌
ఎవరు దేశభక్తులు? ఎవరు దేశద్రోహులు?
దారిదీపం
పొంచివున్న ఆర్థిక హింస
రవాణా కార్మికుల సంఘర్ష యాత్ర - అనుభవాలు
రాజ్యాంగ పతనంలో రాజకీయుల పాత్ర
కేజీబివీలలో బోధనేతర సిబ్బంది బాధలు తీరేదెపుడు?
జిన్‌, జియాన్‌, ఆజాదీ - ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా!
ధనవంతులదేనా భారతం..!
ప్రపంచంలో భారత్‌ స్థానం ఎక్కడీ
ఆడబిడ్డల్ని బతకనిద్ధాం
నువ్విక్కడ... నేనక్కడ...
వెంకన్న రాలే..!
ప్రజాసంక్షేమం - వక్రభాష్యాలు
నేతాజీ వారసత్వాన్ని దొంగిలించ గలరా?
మహాసమీకరణ - లౌకికశక్తుల ఏకీకరణ

తాజా వార్తలు

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

01:44 PM

బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట...

01:33 PM

బడ్జెట్‌లో మహిళలకు ప్రత్యేక పథకం..

01:18 PM

కొత్త‌ ఫిష్ క్యాంటీన్ ను ప్రారంభించిన‌ మంత్రి త‌ల‌సాని..

01:12 PM

భారీ లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు..

01:06 PM

కేజీ టు పీజీ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

05:21 PM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.