Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మహాసమీకరణ - లౌకికశక్తుల ఏకీకరణ | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 22,2023

మహాసమీకరణ - లౌకికశక్తుల ఏకీకరణ

         పాలకవర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా రెండుగా చీలిపోయిన మన మీడియాలో వాస్తవాలు తెలుసుకోవడం రానురాను దుస్సహంగా తయారవుతున్నది. దేనికి హైప్‌ లభిస్తుందో ఏది అవహేళనకు గురవుతుందో తమ తమ ఎజెండాలను బట్టి నిర్ణయించడం తప్ప జరిగిన దాన్నిచెప్పి తర్వాత తమ అభిప్రాయం అనే ప్రాథమికసూత్రం తలకిందులైంది. ఆయా మీడియా సంస్థలు తలుచుకుంటే ఒక పక్షానికి సంబంధించిన అతిచిన్న అంశం కూడా రోజులతరబడి రొదచేస్తుంది. అదేవారికి మింగుడు పడకపోతే వేలు, లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నా అప్రధానమై పోతుంది. వారి కథనాలు కబుర్లే మొత్తం నిండిపోతాయి. మీడియా అనబడే మోడియాలో ఇది నిత్యకృత్యం. 18వ తేదీన ఖమ్మంలో జరిగిన బిఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ సందర్భానికి ఇది అక్షరాలా వర్తిస్తుంది. రాష్ట్రాధినేత కేసీఆర్‌తో పాటు ముగ్గురు ముఖ్యమంత్రులు ఒక పెద్ద రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ జాతీయ కార్యదర్శి, ఇద్దరు రాష్ట్ర కార్యదర్శులు, ఇంకా ఎందరో నేతలు అపూర్వమైన స్థాయిలో అశేష జనవాహిని పాల్గొన్న ఆ సభ ఇచ్చిన పిలుపు సంకుచిత వ్యాఖ్యలు సత్యదూరమైన విశ్లేషణల మరుగున కప్పిపుచ్చే ప్రయత్నం పెద్దఎత్తునే జరిగింది. వచ్చినవారు ఇచ్చిన పిలుపూ కంటే రానివారిపై రాగాలాపన అధికమైంది. సాధించిన ఫలితాలను పక్కకు నెట్టి అయాచిత రాజకీయ జోస్యాలతో ముంచెత్తడం ప్రహసన ప్రాయంగా సాగుతున్నది. ఉదాహరణకు ఆపరేషన్‌ ఫాంహౌస్‌ ఎంత అప్రజాస్వామికమో ఎంత కుట్రపూరితమో చూడకుండా కేసీఆర్‌ నాటకమని కొట్టిపారేయడం!
బీజేపీపై శంఖారావం
బిఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభకు నిజంగానే ఒక ప్రత్యేకత ఉంది. టీఆర్‌ఎస్‌గా కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధన, వరసగా రెండు సార్లు ఎన్నికల్లో గెలవడం కూడా ప్రత్యేకతలే. అలాంటి ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా మారడం, ఇతర జాతీయ పార్టీలు హాజరుకావడం గతంలో చూడలేదు. కాంగ్రెస్‌ లేదా బీజేపీలకు వ్యతిరేకంగా భావసారూప్యత గల పార్టీలు వివిధ చోట్ల శిఖరాగ్రసభలు జరపడం, సభల్లో పాల్గొనడం ఎన్టీఆర్‌ హయాంలోనూ చూశాం, అయితే అది ప్రాంతీయ పార్టీగానే ఉండి జాతీయ కూటమికి నాయకత్వం వహించింది. కాంగ్రెస్‌ వ్యతిరేక కూటమి ఏర్పాటైనప్పుడు బీజేపీని బయిటే ఉంచడం జరిగేది. కేంద్రంలో ఏర్పడిన మూడు ప్రత్యామ్నాయ ప్రభుత్వాలలోనూ ఈ రెండు పార్టీలు లేవు. కనుకనే వాటిని బతకనివ్వలేదు. మొదట్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అన్నిపార్టీల ఐక్యత సిద్ధాంతం తెచ్చిన ఎన్టీఆర్‌ అద్వానీ రథయాత్ర తర్వాత మళ్లీ ఎప్పుడూ బీజేపీతో కలవలేదు. చివరి వరకూ ఆయన రాజకీయం అలాగే ముగిసిపోయింది. చంద్రబాబు నాయుడు మాత్రం అనేకసార్లు అటూ ఇటూ మారుతూ అవకాశవాద ముద్ర వేసుకున్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక చాలాకాలం రాజ్యాంగ ధర్మం పేరిట బీజేపీతో సఖ్యతగానే ఉన్నా మోడీ సర్కారు నిరంకుశ మతోన్మాద పోకడల కారణంగా కేసీఆర్‌ గట్టి వ్యతిరేకవైఖరి తీసుకున్నారు. తనతోపాటు ఇతరులనూ కలుపుకువస్తానని ప్రకటించారు. వామపక్షాలను మినహాయిస్తే ఇప్పుడు మరో ముఖ్యమంత్రి ఎవరూ ఈ స్థాయిలో బీజేపీపై సైద్ధాంతిక రాజకీయ ప్రతిఘటన చేయడం లేదనేదివాస్తవం. షరామామూలుగా ఇందుకుగాను ఆయన పార్టీనేతలు కూడా కేంద్ర సంస్థల దాడులూ దర్యాప్తుల తంతును ఎదుర్కొంటూనే ఉన్నారు. అయినా వెనకడుగు వేయకుండా మతతత్వ రాజకీయాలను ఎదుర్కొంటానికే కట్టుబడటం తప్పక గుర్తించాల్సిన విషయం. బిఆర్‌ఎస్‌ను ఏపీతో సహా వివిధ చోట్ల విస్తరించే చర్యలూ ఏకకాలంలో కొనసాగించడం ఇందులో భాగమే. ఈ విధంగా వివిధ కోణాలలో బిఆర్‌ఎస్‌ విస్తరణ కార్యకలాపాలు పోటీలు వంటివాటిని గరిష్టస్థాయికి చేర్చే తొలి ప్రయత్నం ఖమ్మం సభ.
ఈ సభలో పాల్గొన్న అగ్రనేతలూ, హాజరైన ప్రజా సముద్రమూ చూసినవారెవరరైనా జయప్రదంగా క్రమశిక్షణగా జరిగిందని చెబుతారు. పలువురు జాతీయ నాయకులు ఇతర భాషల్లో మాట్లాడినా, ప్రజలు చెదిరిపోయింది లేదు. ఎక్కువ మంది ఉన్నా విషయం ఒక్కటే అన్న అవగాహనా కనపర్చారు. బీజేపీ కేంద్రీకృత పెత్తనం, మతతత్వం, రాష్ట్రాలపై దాడి వీటిని ఏకోన్ముఖంగా ఎదుర్కోవాలన్నదే వారందరి ప్రసంగాల సారాంశం. కేసీఆర్‌ ప్రభుత్వ పథకాలు కొన్ని చూసిన మేరకు వారు అభినందించారు. తమ రాష్ట్రాలలో విజయాలు కొన్ని ప్రస్తావించారు. సమాఖ్యతత్వంపై నడిచే విశాల భారతంలో నిజంగా జరగాల్సిందే అది. అక్కడెవరూ కృత్రిమమైన నాటకీయమైన విన్యాసాలు చేయలేదు. అతిశయాలు చెప్పలేదు. మోడీపై వ్యక్తిగత దాడీ చేయలేదు. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, వచ్చే ఏడాది మొదట్లోనే లోక్‌సభ ఎన్నికలు రానుండగా ప్రతిపక్షాల మధ్య సదవగాహన ఆహ్వానించదగింది. ప్రయోజనకరమైంది. దేశానికి తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్నిచ్చిన కమ్యూనిస్టు కేరళ, దేశంలోనే పెద్దదైన ఉత్తరప్రదేశ్‌, నూతనశక్తుల ప్రభవానికి ప్రతీకగా పెంపొందుతున్న ఆప్‌ వంటి పార్టీల నేతలు ఒక వేదికపైకి రావడంలో విలక్షణత చూడటానికి కొందరికి మనస్కరించలేదు. వచ్చిన వారి విశిష్టతను చూడటానికి బదులు రానివారి గురించి ఎక్కువగా మాట్టాడటం మొదలెట్టారు.
కుటిల వ్యాఖ్యానాల బండారం
బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు నుంచి స్టాలిన్‌ రాలేదేంటని ఇలా వెతకడం మొదలెట్టారు. వీరందరినీ వివిధ సందర్భాలలో కేసీఆర్‌ కలసివచ్చారనేది నిజం. వారిలో ఆయన అనుకున్న వారిని ఇక్కడకు పిలిచారు. మిగిలిన వారిని మరోచోటకి పిలవొచ్చు. లేదా తానే అక్కడకు వెళ్లొచ్చు. కొంతమంది రాకపోవచ్చు కూడా. అయితే దాన్ని బట్టి జరిగిన బ్రహ్మాండమైన సమీకరణ ఇచ్చిన కీలకసందేశం మరుగునపడతాయా? మోడీ అధికారం చేపట్టిన తర్వాత ఈ స్థాయిలో విశాల రాజకీయ సమీకరణల్లో ఇదీ ఒకటి అవుతుంది కదా? అంతేగాక దేశంలో లౌకిక శక్తులను ఒకతాటిపైకి తేవాలనే యత్నంలో ఇదొక ముందడుగుకదా? ఇవన్నీ తెలిసి కూడా సమస్యను కేసీఆర్‌కూ ఆయన కుటుంబానికో లేక తెలంగాణకో పరిమితం చేసి మాట్టాడ్డంలో విజ్ఞత ఎక్కడీ మోడీ ప్రభుత్వం విధానాలపై పోరాటం, వాటివల్ల కలిగిన దుష్ఫలితాలను ఎదుర్కొనే కార్యక్రమం అవగాహన వంటివాటిపై కేంద్రీకరించడం ఇక్కడ ముఖ్యం. విశాలమైన అత్యవసరమైన ఈ జాతీయ పరిస్థితిని విస్మరించి కేవలం తెలంగాణలో ఏం జరిగింది? ఏం జరగలేదు? కేసీఆర్‌ గతంలో ఏం చెప్పారు? ఏం చేశారు? అనేదానిచుట్టూనే చర్చను గింగిరాలు తిప్పడం దుర్బుద్ధి గాక ఏమిటి? అది కూడా రాజకీయంగా గాక కుటుంబాలు వ్యక్తులపై కేంద్రీకరించడం... మరోవైపున సర్జికల్‌ స్ట్రయిక్స్‌, హిందూత్వ రాజకీయాల బెదిరింపులతో బండి సంజరు వంటివారు మాట్లాడే దూషణలను దురహంకార భాషణలను పట్టించుకోకపోవడం! తెలంగాణలో ఏక్‌దం బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందని జోస్యాలు చెప్పి జోష్‌ పెంచిన వారికి మునుగోడు ఎదురుదెబ్బ తగిలినా కూడా వాస్తవాలను గమనించలేకపోవడం. పైగా అక్కడ టీఆర్‌ఎస్‌ విజయానికి కీలకంగా సహకరించిన సీపీఐ(ఎం), సీపీఐలను ఆడిపోసు కోవడం ఏమిటి? బీజేపీపై పోరాటంలో టీఆర్‌ఎస్‌ను ఎందుకు ఏ మేరకు బలపరుస్తున్నదీ తమ్మినేని వీరభద్రం వంటివారు ప్రతిసందర్భంలోనూ చెబుతున్నా సరే. ఇదేదో ఎన్నికల రాజకీయంగా ముద్ర వేయడంవారి నిజ స్వరూపాన్నే చెబుతుంది. నిజానికి మొన్నటి సభలోనూ ఆయన అనేక సమస్యలు ప్రస్తావించారని గమనించాలి. కేసీఆర్‌ నాయకత్వం, తెలంగాణ మోడల్‌ వంటివి బిఆర్‌ఎస్‌ చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు. కాని ఖమ్మం సభ ఉద్దేశం లేదా కమ్యూనిస్టుల లక్ష్యం బీజేపీని ఓడించడం నిరోధించడం. అది అవససరమో కాదో చెప్పకుండా మంచిదో కాదో తేల్చకుండా కెసిఆర్‌ చుట్టూనే చర్చ తిప్పడం తీరం చేర్చదు.
మౌలిక ప్రశ్న
ఈ నానా రకాల వ్యాఖ్యలు చేసేవారు చెప్పవలసింది ఒకటే - మతతత్వ రాజకీయాలనూ మోడీ సర్కారు అప్రజాస్వామిక విధానాలను ఓడించాలా? వద్దా? ఆ దిశలో సాధ్యమైనంత ఐక్యతతో లౌకిక పక్షాలు కలసి సాగాలా వద్దా? బిఆర్‌ఎస్‌ ఎంత విస్తరిస్తుందనేది భవిష్యత్తు చెబుతుంది. ప్రత్యేకించి ఏపీలో స్పందన ఎలావుండేది కూడా తెలుస్తుంది. కాని అటూ ఇటూ చర్చ దానికే పరిమితం చేయడమేమిటి? తెలంగాణలో జరిగే పోరాటం మాత్రం తక్కువ కీలకమా? దక్షిణాదిన ఉన్న కర్నాటకలో కూడా బీజేపీ మెజార్టి తెచ్చుకోలేకపోవచ్చని సర్వేలు చెబుతుంటే తెలంగాణ గడ్డపై గెలిచే అవకాశం ఇవ్వడం ప్రజాస్వామిక వాదుల పవిత్ర కర్తవ్యమా? పొత్తులు కలయికల గురించి అక్కడ ఎవరూ మాట్లాడింది లేదు. దాదాపు ముప్పై ఏండ్లలో ఎన్నికల తర్వాతనే ప్రభుత్వాల ఏర్పాటు ప్రధాని అభ్యర్థి వంటివి ముందుకొస్తాయని చరిత్ర చెబుతున్నది. సీతారాం ఏచూరి పదేపదే గుర్తు చేస్తూనే ఉన్నారు. అయినా సరే కృత్రిమంగా దాన్ని ముందుకు తెచ్చి నితీశ్‌ వర్సెస్‌ మమత వర్సెస్‌ కేసీఆర్‌ వర్సెస్‌ కేజ్రీవాల్‌ అంటూ అసందర్భ చర్చలతో పక్కదోవ పట్టించడం బీజేపీకే దోహదకరం. కాంగ్రెస్‌ పాత్ర గురించి సవాళ్లు తీసుకురావడం. బాగా బలహీనపడినప్పటికీ కాంగ్రెస్‌ రాజకీయ స్థానం వారి విధానాలపైన ఇతర పార్టీల ప్రభావాన్ని గుర్తించడంపైనా ఆధారపడివుంటుంది. అదీ ఇప్పటి చర్చ కాదు. రేపు తొమ్మిది రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో మూడు ఉత్తరాది రాష్ట్రాలలోనూ ఈశాన్యంలోనూ అది ఏ మేరకు పోరాడుతుందనే దాన్ని బట్టి ప్రజలకు స్పష్టత వస్తుంది. ఇక త్రిపురలో వామపక్షాలు కాంగ్రెస్‌ ఒక ప్రాథమికఅవగాహనకు వచ్చినట్టు వార్తలున్నాయి. తెలంగాణ వరకూ బిఆర్‌ఎస్‌ను బీజేపీ బిటీం అని కాంగ్రెస్‌ కొట్టిపారేయడం కనిపిస్తూనే ఉంది. దేశంలో చాలా చోట్ల వారి తీరుకు ఇది భిన్నంగా లేదు. ఖమ్మం సభకూ ఆ సమస్యకూ అసలు సంబంధం లేదు. ఏమైనా దేశంలో లోక్‌సభ ఎన్నికల దిశలో ఏడాది ముందుగానే లౌకిక ప్రతిపక్షాల మధ్య అవగాహన సూచనలు స్వాగతించదగినవి. ఎవరెన్నివిధాల తక్కువ చేసినా తికమక పెట్టినా చెరిగిపోని సత్యమిది. షరా మామూలగా కమ్యూనిస్టుల విధాన స్పష్టతనూ కార్యాచరణ లో ప్రజా నిబద్దతను వెనక్కునెట్టి అకారణ ఆరోపణలూ అవహేళనలకు గురిచేసే కుటిల రాజకీయాలూ ఎప్పటిలాగే విఫలమవడమూ అనివార్యం. ఎందుకంటే ఖమ్మం ఒక శుభారంభం. రాష్ట్రానికి దేశానికీ కూడా!

- తెలకపల్లి రవి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'
విప్లవ యోధ కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం
కాలిగిట్టెల శబ్దం
ప్యారిస్‌ కమ్యూన్‌: ఒక గమనం! ఒక గమ్యం!
కార్మిక-కర్షక పోరాటాలను ఉధృతం చేయండి
కేంద్ర విధానాలతో విద్యుత్‌ భారాలు
హేతువాద కవిత్వం రాసిన సంప్రదాయ కవి
భూమి, భుక్తి, విముక్తి ధీరుడు కామ్రేడ్‌ ఠానునాయక్‌
ఛాందసం
హయ్యర్‌ పెన్షన్‌పై సుప్రీం తీర్పును అమలు చేస్తారా?
కేంద్ర విధానాలతో విద్యుత్‌ భారాలు
వలస శవం
'పరీక్షా' కాలం!

తాజా వార్తలు

07:24 AM

తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు..

07:15 AM

నేడు కవిత పిటిషన్‌పై సుప్రీం విచారణ..

06:57 AM

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ షెడ్యూల్ విడుద‌ల‌..

06:39 AM

చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బిగ్‌ షాక్‌..!

06:12 AM

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ ..

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.