Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రపంచంలో భారత్‌ స్థానం ఎక్కడీ | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 25,2023

ప్రపంచంలో భారత్‌ స్థానం ఎక్కడీ

             2014 మే 25న అధికారానికి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నికల మ్యానిఫెస్టోలో 30 సంక్షేమ పథకాలను ప్రకటించింది. దేశంలో 2025 నాటికి జాతీయ స్థూల ఉత్పత్తి ఐదు ట్రిలియన్‌ డాలర్లకు పెంచుతానని ప్రకటించింది. ప్రస్తుత స్థూల ఉత్పత్తి 2.66 ట్రిలియన్‌ డాలర్లు మాత్రమే ఉన్నది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ప్రకటించింది. ప్రతి వ్యక్తికి ఏదో ఒక బీమా పథకాన్ని అమలు చేసి రక్షణ కల్పిస్తానని జీవన్‌ సురక్ష, జీవన్‌ జ్యోతి, అటల్‌ పెన్షన్‌ యోజన లాంటి పథకాలను ప్రవేశపెట్టింది. అందరికీ ఆహారం, ఉపాధి, ఆవాసం ఏర్పాటు చేస్తానని కూడా ప్రకటించింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచడానికి 2వ హరిత విప్లవం ప్రారంభించింది. ఇందుకు గానూ రూ.33,270 కోట్లు 11శాఖలకు కేటాయించింది. కానీ ఇంత వరకు హరిత విప్లవానికి సంబంధించి ఉత్పాదకత, పెరుగుదలకు గాని, అందుకవసరమైన పరిశోధనలకు గాని, తగు ఏర్పాట్లేమీ చేయలేదు. 2020 మే 14న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ.20లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించి, పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాలను అభివృద్ధిలోకి తెస్తామని చెప్పింది. నేటికీ ప్రకటించిన రూ.20లక్షల కోట్లల్లో 20శాతం కూడా వ్యయం చేయలేదు. దేశంలో ఆకలి, ఉపాధి కొరత తీర్చడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదు. ఈ ప్యాకేజీలో కాంట్రాక్టర్లకు మాత్రం ఊరట కలిగించారు. రూ.95వేల కోట్ల బాకీలో ఉన్న విద్యుత్‌ డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు రూ.90వేల కోట్లు ఇవ్వడంతో పాటు, విద్యుత్‌ రంగాన్ని కేంద్ర జాబితాలోకి తీసుకుంటామని పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో సబ్సిడీలు ఇవ్వకూడదని, క్రాస్‌ సబ్సిడీ ఉండకూడదని, విద్యుత్‌ ఉత్పత్తికి జరిగిన మొత్తం ఖర్చును వినియోగదారుల నుండి వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే తెలంగాణ రాష్ట్రంలోని 1.65 కోట్ల విద్యుత్‌ కనెక్షన్లల్లో కోటి కనెక్షన్లు టారీఫ్‌ భారాలు భరించలేక కనెక్షన్లు వదులుకోవాల్సి వస్తుంది.
స్వచ్ఛ భారత్‌, కాలుష్య నివారణ (గంగానది ప్రక్షాళన) తదితర ప్రణాళికలు ప్రకటించడమే తప్ప, అందుకు కేటాయించే నిధులన్నీ కాంట్రాక్టర్ల జేబుల్లోకే వెళ్ళాయి. నేడు దేశంలోకి నూనెలు, పప్పులు, ఆయుధాలు పెద్ద ఎత్తున దిగుమతులవుతున్నాయి. వీటిని తగ్గించడానికి మేక్‌ ఇన్‌ ఇండియా పేరుతో, సెల్ఫ్‌ రిలయన్స్‌ పేరుతో ఉత్పత్తిని పెంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపున ఉత్పత్తి రంగాలను పూర్తిగా ముఖేష్‌ అంబానికి, గౌతం ఆదానికి ధారాదత్తం చేస్తున్నది. రక్షణశాఖలో ప్రస్తుతం ఉన్న 49శాతం నుండి 74శాతానికి పెంచుతూ ఎఫ్‌డీఐ (విదేశీ ప్రత్యక్ష నిధులు)కు అనుమతిచ్చింది. విమానయాన సంస్థకు ప్రభుత్వం రూ.1000 కోట్లు కేటాయించి 6 విమానాశ్రయాల ప్రయివేటీకరణకు తెరతీసింది. కార్పొరేట్లకు ఆదాయం వనగూర్చే ప్రభుత్వ సంస్థలన్నింటినీ బుక్‌ వ్యాల్యూకు అమ్మడానికి పూనుకున్నది. ఇప్పటికే రూ.10లక్షల కోట్ల విలువ గల ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మటం జరిగింది. అలాగే 27 బ్యాంకులను 12బ్యాంకులుగా కుదించి పోగైన నిధులను ఇప్పటికే బ్యాంకులకు రూ.10లక్షల కోట్లు ఎగవేసిన పెట్టుబడిదారులకు తిరిగి అప్పులివ్వడానికి ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నది. రిజర్వు బ్యాంకును కార్పొరేట్లకు కోరిన విధానాలను రూపొందించే సంస్థగా మార్చారు. ఆ విధంగా దేశంలోని అన్ని రంగాలను ప్రయివేటీకరణ పేరుతో కార్పొరేట్లకు అప్పజెపుతున్నారు.
ప్రజల పరిస్థితి ఏమిటి?
2022 డిసెంబర్‌ 31 నాటికి ప్రపంచ జనాభాలో భారతదేశం మొదటిదిగా నమోదైంది. 141.7కోట్ల ప్రజలతో భారతదేశం మొదటి స్థానం పొందగా, 141.2 కోట్లతో చైనా రెండవ స్థానంలోకి చేరింది. భారత జనాభాలో అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం 34శాతం అత్యంత దారిద్య్రరేఖకు దిగవనున్నారు. వాస్తవానికి ఆహార కొరతతో ఇబ్బంది పడుతున్నవారు 80కోట్ల మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఉపాధి కోసం 25 కోట్ల మంది అనునిత్యం కార్యాలయాల వెంట, కంపెనీల వెంట, భవన నిర్మాణాల వెంట తిరుగుతున్నారు. కరోనా సందర్భంగా ఉపాధి కోల్పోయి 19 కోట్ల మంది వలస కార్మికులు తిరిగి గ్రామీణ ప్రాంతాలకు చేరారు. వీరితో కలిసి గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగంపై 90కోట్ల మంది ఆధారపడి బతుకులీడుస్తున్నారు. దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో 6వ స్థానంలో ఉన్నది. మొదటి వరుసలో అమెరికా 20.89, చైనా 14.72, జపాన్‌ 5.06, జర్మనీ 3.85, ఇంగ్లాండ్‌ 2.67 ట్రిలియన్‌ డాలర్లతో ఉ ండగా, భారతదేశం 2.66 ట్రిలియన్‌ డాలర్లతో 6వ స్థానంలో ఉన్నది. ఇప్పటికే బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభుత్వం, చైనాను అధిగమించే దిశగా భారత ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్తున్నదని ప్రకటించింది. 2.66 ట్రిలియన్‌ డాలర్ల ఆదాయం ఉన్న భారతదేశం 14.72ట్రిలియర్‌ డాలర్ల చైనాతో పోటీకి వెళ్ళగలదా?
నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి బదులు కేంద్రం ఉన్న ఫ్యాక్టరీలను మూసివేసి నిరుద్యోగుల సమస్యను పెంచుతున్నది. కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టేందుకు పేరుతో లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్నది. మానవాభివృద్ధి సూచికలో భారతదేశం గతంలో 104వ స్థానంలో ఉండగా, నేడు 132వ స్థానానికి పడిపోయినట్లు 2021-22 రిపోర్టు గత సెప్టెంబర్‌ 8న ప్రకటించింది. 191 దేశాల్లో భారతదేశం 132వ స్థానంలో ఉన్నది. ఆకలి సూచికలో 121 దేశాల్లో భారతదేశం 107వ స్థానంలో ఉన్నది. ఆరోగ్య సూచికలో 195 దేశాల్లో భారతదేశం 66వ స్థానంలో ఉన్నది. ఆరోగ్య సూచికలో కూడా చిన్న దేశాల కన్నా వెనుకబడే ఉన్నాము. అప్పుల విషయం పరిశీలిస్తే, స్వదేశీ, విదేశీ అప్పులు కలిసి దేశం 135 లక్షల కోట్ల బాకీలో ఉన్నది. విదేశీ రుణం వరకే పరిశీలిస్తే 620.7 బిలియన్‌ డాలర్ల రుణంలో దిగబడి ఉన్నది. యేటా రూ.12 లక్షల కోట్లు ఈ రుణాలకు వడ్డీల క్రింద చెల్లిస్తున్నాం. రుణాలు తేవడమే తప్ప, ఇంత వరకు చెల్లింపులు ప్రారంభించలేదు. చెల్లింపులు ప్రారంభించబడితే భారత ఆర్థిక వ్యవస్థ తట్టుకోలేదు. 1947 ఆగస్టున డాలర్‌కు రూపాయి సమానం కాగా, నేడు డాలర్‌కు రూ.83కు విలువ పడిపోవడం ఇందుకు ప్రత్యక్ష్య నిదర్శనంగా ఉన్నది. సహజంగా అప్పులు తెస్తే, ఆస్తుల సంపాదనకు వ్యయం చేస్తారు. కానీ భారతదేశంలో ఉత్పాదకరంగానికి కాకుండా, అనుత్పాదక రంగానికి ఆ నిధులు వ్యయం చేయడం వల్ల తిరిగి చెల్లించే ఆర్థిక స్తోమత దేశానికి లేకుండా పోతున్నది. ఏ రంగంలో చూసినా భారతదేశం 2014 నుండి 2023 జనవరి వరకు అన్ని రంగాల్లో వెనుకబాటుతనాన్నే ప్రదర్శిస్తున్నది. ఇప్పటికే ఎగుమతి, దిగుమతుల్లో రూ.10లక్షల కోట్ల లోటు ఉన్నది. రూ.35లక్షల కోట్ల దిగుమతులు కాగా, రూ.25లక్షల కోట్ల ఎగుమతులు చేస్తున్నాము. ఇందులో ఆహార ధాన్యాలు రూ.5లక్షల కోట్ల వరకు దిగుమతి అవుతున్నాయి. సాగుభూమి 43కోట్ల ఎకరాలు ఉండగా, 9కోట్ల ఎకరాలు బీడ్లుగా మారాయి. ఉన్నత విద్య అభ్యసించినవారు ఇక్కడ ఉపాధి లేదని విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే దాదాపు వివిధ దేశాలకు ఐదుకోట్ల మంది వెళ్లినట్లు వలస గణాంకాలు చెబుతున్నాయి. మేధావులంతా విదేశాలకు వెళ్ళిపోవడంతో దేశాభివృద్ధికి తోడ్పడే మేదస్సు కొరత ఏర్పడింది. అందుకే వ్యవసాయ రంగంతో పాటు, అన్ని రంగాల్లో పరిశోధనలు మూసివేసారు. టెక్నాలజీతో సహా. ఆహారధాన్యాలను కూడా దిగుమతి చేసుకుంటున్నాం. ఇలాంటి దుస్థితి మరో ఐదు సంవత్సరాలు కొనసాగితే మనదేశం అగ్రదేశాలకు దిగుమతుల ''డంపింగ్‌ కేంద్రం''గా మారుతుంది. అందువల్ల ఇప్పటికైనా ప్రణాళికా బద్ధమైన ఉత్పత్తిని, దేశంలోని మౌలిక వసతులను సద్వినియోగం చేసుకునే విధానాలను రూపొందించితే తప్ప ముందుకెళ్ళలేం. ప్రణాళికా విభాగాన్ని రద్దుపరచి నిటి అయోగ్‌ తేవడం దుష్పరిణామమే తప్ప మరొకటికాదు. తప్పుడు విధానాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్‌ తరాలు మరింత దెబ్బతింటాయి.

-సారంపల్లి మల్లారెడ్డి
 సెల్‌:9490098666

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'
విప్లవ యోధ కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం
కాలిగిట్టెల శబ్దం
ప్యారిస్‌ కమ్యూన్‌: ఒక గమనం! ఒక గమ్యం!
కార్మిక-కర్షక పోరాటాలను ఉధృతం చేయండి
కేంద్ర విధానాలతో విద్యుత్‌ భారాలు
హేతువాద కవిత్వం రాసిన సంప్రదాయ కవి
భూమి, భుక్తి, విముక్తి ధీరుడు కామ్రేడ్‌ ఠానునాయక్‌
ఛాందసం
హయ్యర్‌ పెన్షన్‌పై సుప్రీం తీర్పును అమలు చేస్తారా?
కేంద్ర విధానాలతో విద్యుత్‌ భారాలు
వలస శవం
'పరీక్షా' కాలం!

తాజా వార్తలు

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.