Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ' | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Jan 29,2023

ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'

          'ఓరుగల్లు నుండి ఇటీవల పిల్లల కోసం రాస్తున్నవారిలో శ్రీమతి మాదరపు వాణిశ్రీ ఒకరు. బాలల కోసం కథ, నవల, గేయం, కవిత వంటివి రాయడమే కాకుండా ఒకే రోజు ఒకే వేదిక మీద ఆరు పుస్తకాలను ఆవిష్కరించుకున్న రికార్డు వాణిశ్రీది. మాదరపు వాణిశ్రీ కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో సెప్టెంబర్‌ 2, 1965న పుట్టింది. రావికంటి శ్యామల- సాంబయ్య అమ్మానాన్నలు. మెట్టినిల్లు హనుమకొండలో మూడున్నర దశాబ్దాలుగా ఉంటున్నారు. మాగెటో థెరపిలో డిప్లమా, పొలిటికల్‌ సైన్స్‌లో ఎం.ఏ చదివారు.
          కథ, కవిత్వంతో పాటు ఇతర సాహితీ రూపాలు, ప్రక్రియల్లో రచనలు చేసిన వాణిశ్రీ ఆధ్యాత్మిక రచనలు కూడా చేశారు. పుస్తకంగా అచ్చయిన వీరి తొలి రచన ఆధ్యాత్మిక రచనయే. అది, 'శ్రీ లక్ష్మీనారాయణస్వామి భజన గీతం'. ఇది పుస్తకంగానే కాక ఆడియో సి.డి రూపంలోనూ వెలువడింది. ఇది అష్టోత్తర శత వాక్య గీతం. 'మనసు పలికే...' మాదరపు వాణిశ్రీ వచన కవితా సంపుటి. కథలను 'పదనిసలు' పేరుతో సంపుటిటా తెచ్చారు. తెలంగాణ ప్రజల పెద్ద పండుగైన బతుకమ్మకు వీరు వెలువరించిన బతుకమ్మ పాటల పుస్తకం 'మా తల్లీ బతుకమ్మ'. ఇందులో హాయిగా పాడుకుంటూ, బతుకమ్మ ఆడుకునేందుకు చక్కని పాటలు ఉన్నాయి.
బాల సాహితీవేత్తగా బాలల కోసం వివిధ రచనలు చేసిన వాణిశ్రీ తిరునగరి వేదాంతసూరి ప్రోత్సాహంతో మొలకలో పిల్లల కోసం 'సరదాగా కాసేపు...' పేరుతో వివిధ రచనలు చేశారు. ఇందులో బాలల మెదడుకు మేతను పెట్టే ప్రహేళికలు, సరదా అయిన సామెతలు, బుద్దులు చెప్పే మంచిమాటలు, లోచింపజేసే తికమకమ ప్రశ్నలు వంటివి ఇందులో రాశారు. బాలలకు ఒక చోట అందించేందుకు వీటన్నింటిని అదే పేరుతో పుస్తకంగా తెచ్చారు వాణిశ్రీ. ప్రస్తుతం కూడా ఈ శీర్షికను యిదే పత్రికల్లో నిర్వహిస్తున్నారు.
బాలల కోసం, వారి బాగుకోసం... సరదాగా పిల్లలు చదువుకుని ఆనందించడం కోసం రాసిన బాలల కథలను 'చిచ్చుబుడ్లు' పేరుతో పుస్తకంగా తెచ్చారు. ఇందులోని కథల చిచ్చుబుడ్లు బాలల మనస్తత్వాలకు అద్దం పట్టడమేకాక ఆనందాన్నిస్తాయి. ఇందులో పిల్లలు ఆనందంగా, సరదాగా చదువుకునే కథలేకాక, పిల్లలను అపహరించే మాఫియా గురించి రాస్తుంది రచయిత్రి. అంతేకాదు బాలలకు చిన్నప్పుడే అన్ని విషయాల అవగాహన కలిగేందుకు విదేశాల్లో ఉండే పిల్లల కోసం పల్లెల్లో ఒంటరిగా తపించే తల్లి తండ్రుల తండ్లాటను కూడా తన కథలో చూపిస్తారు. బాల్యం నుండే భారతీయ జీవనమూలాలకు ఆధ్యమైన భారతం, భాగవతం, రామాయణం వంటివాటిని పిల్లల కుపరిచయం చేయాలన్న తపన, తండ్లాట కూడా వీరి కథల్లో మనకు కనిపిస్తుంది. బాలల కథల పుస్తకాన్ని తన కుమారునికి అంకితం చేయడం రచయిత్రి ఔచిత్యానికి తార్కాణం. అంతేకాదు ఇందులో బాలల దినోత్సవం వంటి వాటి గురించి కూడా ఈ సంపుటిలో ఉన్నాయి. 'తెలివైన గడుగ్గారు', 'మందబుద్ది', 'చిచ్చుబుడ్లు', 'పరుగు' వంటి కథలు సామాజిక స్పృహకు అద్దంపట్టగా, ఇతర కథలన్నీ పిల్లలను సరదాగ చదివిస్తాయి.
పిల్లల కోసం రాసిన వీరి నవల 'సెలవుల్లో పట్నం పిల్లలు'. పట్నం పిల్లలు సెలవుల్లో అమ్మమ్మింటికి వచ్చి అక్కడ జరిగే ఒక ట్రెజర్‌ హంట్‌లో పాల్గొం టారు. సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల పట్ల అవగాహనతో పిల్లలు ఈ గేమ్‌లో విజయం సాధించడం చూపిస్తారు. బాల్యంలోనే బాలలకు సంస్కృతీ సంప్రదాయాలను పరిచయం చేస్తే కలిగే ఉపయోగాన్ని చెబుతూ సాగుతుందీ బాలల నవల. ఇంకా నీతి నిజాయితీ, మంచితనం వంటివి పిల్లలకు పరిచయం చేస్తారీ నవలలో రచయిత్రి.
రచయిత్రిగా ప్రపంచ తెలుగు మహాసభల సత్కారం మొదలుకుని విశ్వశాంతి సేవా సమితి పురస్కారం, జాగృతి కవితాంజలి పురస్కారం, తెలుగు రక్షణ వేదిక వంటి మరికొన్ని సంస్థల సత్కారాన్ని అందుకున్న వాణిశ్రీ కథలు, నవలలే కాకా పిల్లల కోసం చక్కని బాల గేయాలను కూడా రచించారు. వివిధ పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వీరి బాల గేయాలు వచ్చాయి. 'చిట్టి పొట్టి పాపాలు / చిన్నారి బాలలు' అంటూ వారిని 'పాపపుణ్యాలు తెలియని / పవిత్ర హృదయాలు' అంటూ చెబుతారు. బాలల కోసం చక్కని రచనలు చేస్తున్న ఈ ఓరుగల్లు హరివిల్లు భవిషత్తులో మరిన్ని బాలల రచనలు తెస్తుందని ఆశిద్దాం. జయహో! బాల సాహిత్యం.

- డా|| పత్తిపాక మోహన్‌, 9966229548

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కథల పోటీకి ఆహ్వానం
31న 'ఊహలకే ఊపిరొస్తే' ఆవిష్కరణ
కవితలకు ఆహ్వానం
వేమూరి బలరామ్‌ 'స్వాతి చినుకులు' గ్రంథానికి పురస్కారం
తెలుగు బాల సాహిత్యానికి వెలుగుల కవన సిరి 'డాక్టర్‌ సిరి'
బహుభాషా జాతీయస్థాయి కవి సమ్మేళనంలో నెల్లుట్ల సునీతకు ఘనసత్కారం
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం...
బాల సాహిత్యాన్ని కవితా చిత్రాలతో సుసంపన్నం చేస్తున్న గృహలక్ష్మి 'ఎడ్ల లక్ష్మి'
కదిలే బొమ్మల కథ
సాదత్‌ హసన్‌ మంటు కథల సంపుటి - అనార్కలి..
సిద్ధిపేట బాల సాహితీవేత్త, వికాస కార్యకర్త ఉండ్రాల రాజేశం
జీవితానుభవాల సమాహారం 'రాల్లకుచ్చె'
నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితది
అరుదైన వ్యక్తిత్వమున్న ఓ స్త్రీ కథ ''పుదు వసంతం''
కథకుల కరదీపిక
నీలి గోరింట...
ఆధునిక పంచతంత్రం
ఊరి సామెత
బాల సాహిత్యంలోనూ ఘనాపాటి రేగులపాటి కిషన్‌రావు
శారీరక అవసరాలు, నీతి సూత్రాల మధ్య నలిగిపోతున్న ఆధునిక స్త్రీ కథ నాతి చరామి
సకలకళా వల్లభి సారంగి
బాలల భక్తి సాహిత్య పరిశోధకుడు డా. గౌరవరాజు సతీష్‌కుమార్‌
మా అవ్వగారి కొడవలి అయితే...
గజదొంగ గంగన్న
పిల్లల 'చిట్టి కథ'ల ఆసామి 'తిరుమల వెంకటస్వామి'
అరవై ఏళ్ళనాటి రంగనాయకమ్మ నవల కృష్ణవేణిపై పునర్విమర్శ
ఇటెటు రమ్మంటే ఇల్లంత నాదే అన్నడట
స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
బహిరంగ ప్రకటన
అక్కెర ఉన్నంతసేపు ఆదినారాయణ....

తాజా వార్తలు

06:12 AM

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ ..

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.