Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జనం మెచ్చిన నటుడు | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Apr 20,2020

జనం మెచ్చిన నటుడు

'రక్తకన్నీరు' నాటకంతో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయిన రంగస్థల కళాకారుడు, విలనిజానికి కొత్తభాష్యం చెప్పిన సినీ నటుడు నాగభూషణం (19 ఏప్రిల్‌ 1921-05 మే 1995) శతజయంతి ఈ రోజు. ప్రతినాయకులకు గుర్తింపు తెచ్చిన నటుడు. విలనిజానికి విలక్షణమైన రీతిని అందించారాయన. జీవితంలో మాత్రం కథానాయకుడు. ప్రజల పక్షం నిలిచిన మనీషి. చిన్నతనం నుంచే నాటకరంగం మీద ఆసక్తి వున్న ఈయన పూర్తి పేరు చక్రవర్తుల నాగభూషణం. ప్రకాశం జిల్లా అనకర్లపూడిలో జననం. పేదరికం కారణంగా పి.యు.సి. చదివాక ఉద్యోగంలో చేరకతప్పలేదు. నెలకు పాతిక రూపాయల జీతంతో ఉద్యోగం దొరకడంతో మద్రాసుకు చేరుకున్నారు.
అక్కడే నాగభూషణం జీవితం మలుపు తిరిగింది. నాటకాల మీద ఉన్న ఆసక్తికి మద్రాసు నాటకరంగం ఊపునిచ్చింది. అతనిలోని నటుణ్ణి వెలికితీసి రంగస్థలం మీద అతని ప్రతిభని చాటింది. ప్రజానాట్యమండలితో ఉన్న బంధం ప్రజలపక్షాన నిలబడేలా చేసింది. ఆ కాలంలోనే జి.వరలక్ష్మి, మిక్కిలినేని నాగభూషణంలోని నటునికి సానబెట్టారు. వారి అండదండలు, తోడ్పాటు, ప్రోత్సాహం నాటకరంగంలో తనదైన విలక్షణరీతిన నిలదొక్కుకునేలా చేసింది. ఒకవైపున సినిమాల్లో అవకాశాలు వచ్చినా నాటకరంగాన్ని వీడలేదు. సినిమాల్లో నటిస్తూనే రంగస్థలం మీద కొనసాగడం ఆయన ప్రత్యేకత. ఆనాటికి తమిళ నాటకరంగం ఎం.ఆర్‌.రాధా, మనోహర్‌ వంటి వారి ప్రదర్శనలతో వర్థిల్లుతున్నది. అదే సమయాన మద్రాసులో తెలుగు నాటకాలు కూడా జోరుగా ప్రదర్శిస్తున్న రోజులవి. ఆత్రేయ రాసిన 'భయం, కప్పలు' వంటి నాటకాల్లో నాగభూషణం. వామపక్ష భావజాల నేపథ్యంలో సామాజిక ఇతివృత్తాలతో రూపొందిన ఈ నాటకాల్లో నాగభూషణం నటనాచాతుర్యం రంగస్థలాన్ని శోభాయమానం చేసింది.
ఆనాడు తమిళ నాట ఎం.ఆర్‌.రాధా, మనోహర్‌ ప్రదర్శించే 'రక్తకన్నీరు' నాటకం రంగస్థల సంచలనం. ఆ నాటక ప్రదర్శన నాగభూషణాన్ని ఆకర్షించింది. దాన్ని తెలుగులో రాయించి, అద్భుతంగా ప్రదర్శించారు. తొలి ప్రదర్శనలకు వచ్చిన ప్రతిస్పందన 'రక్తకన్నీరు' మీద నాగభూషణానికి మమకారాన్ని పెంచింది. ఊరూరా ఆ నాటకాన్ని ప్రదర్శించారు. మద్రాసులోనే కాదు తెలుగునాట అన్ని ముఖ్య పట్టణాల్లో ఆ నాటకం ప్రదర్శితమైంది. ప్రదర్శనల సంఖ్య పెరుగుతున్న కొద్దీ నాటకానికి ఆదరణ హెచ్చింది. జనం తండోపతండాలుగా నాటక ప్రదర్శనకు వచ్చేవారు. సూర్యాపేటలో ఈ నాటక ప్రదర్శనని జనం కిక్కిరిసి చూశారు. తెలంగాణలోని అనేక పట్టణాల్లో ఈ ప్రదర్శనకు వచ్చిన స్పందన అనూహ్యం. అంతగా జనాన్ని ఆకట్టుకున్న నాటకం 'రక్తకన్నీరు'లో శారద, వాణిశ్రీలు కూడా భిన్నమైన పాత్రల్ని పోషించారు.
ఆ నాటకం ఇతివృత్తం, అందులో నాగభూషణం వేసిన పాత్ర, ఆయన చెప్పే డైలాగులు జనాన్ని విపరీతంగా ఆకర్షించేవి. ఆయనే స్వయంగా దాదాపు రెండువేలకు పైగా ప్రదర్శనలు ఇవ్వడం విశేషం. ఒకవైపున సినిమారంగంలో అవకాశాలు పెరుగుతున్నప్పటికీ 'రక్తకన్నీరు' ప్రదర్శనలు మాత్రం ఆపలేదు. ఒకనెలలో దాదాపు ముప్పయి ప్రదర్శనలు ఇచ్చారు. కొన్నిసార్లు రాత్రి రెండుసార్లు నాటక ప్రదర్శనలు ఇచ్చిన సందర్భాలున్నాయి. తర్వాతకాలంలో సినిమాలకు ఎక్కువ సమయం ఇవ్వాలన్న ఒత్తిడి పెరగడంతో 'రక్తకన్నీరు' ప్రదర్శనలు తగ్గించారు. అయితే స్టార్‌ విలన్‌గా ఉంటూ రంగస్థలానికి అంత సమయం కేటాయించిన నటుడు నాగభూషణం తప్ప మరొకరు లేరు.
సినిమా నటునిగా విలనిజానికి ఆయన ఏర్పరిచిన ఒరవడిని రావుగోపాలరావు, నూతన్‌ప్రసాద్‌, కోట శ్రీనివాసరావు వంటి వారు కొనసాగించారు. వెండితెర మీద విలన్‌గానే గాక, ఒకటీ రెండు చిత్రాల్లో హీరోగానూ, ఆడపిల్లల తండ్రిగా కరుణరసాత్మకంగానూ నటించారు నాగభూషణం. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు వెండితెర మీద ఒక వెలుగు వెలిగి, చిరస్మరణీయమైన పాత్రల్లో జీవించారు. సినీ కళాకారుల సంక్షేమనిధిని ఏర్పాటు చేసిన వ్యక్తిగానూ ఆయనకు గుర్తింపు ఉంది. రక్తకన్నీరు నాటకాన్ని దాదాపు పాతికేళ్ళుగా దేశవ్యాప్తంగా ప్రదర్శిస్తూ మూడువందలమందికి పైగా కళాకారుల్ని పోషించడం చెప్పుకోదగ్గ విషయం. రంగస్థల నటునిగా, సినీనటునిగా రాణించిన నాగభూషణం నిరంతరం పేదలకు అండగా నిలబడ్డారు. మాటలో, చేతలో వామపక్షభావజాలంతోనే కడదాకా జీవించారు.
- సంజీవ్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కూలుతున్న కుటుంబాలు
బొమ్మలరామారంలో కొత్తరాతిబొమ్మల తావు
వేగు చుక్కల వెలుగు తార ఇరివెంటి కృష్ణమూర్తి
అమ్మకు ఓ బహుమతి
ఒట్టు... నీ మీద ఒట్టు
కూతురుగా పుట్టి కొడుకుగా భాద్యతలు నెరవేర్చిన ఆర్తి కథ ఆమా
నేడే... మేడే...
'చింతల'పాలెంలో శిథిల త్రికూటాలయం, అపూర్వ శిల్పాలు
తల లేని తోక!
అసమానతలు లేని సమాజాన్ని కాంక్షించిన నవల 'అవతలి గుడిసె'
మంచి జీవితానికి భరోసా
పర్యావరణ రక్షణే ధరిత్రీ రక్షణ
స్త్రీల రక్తం పీల్చేసి, జీవితాంతం పీక్కుతింటూన్న రాకాసి గద్ద వంటిల్లు ''ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌''
తరతరాల చికిత్స విధానం... కైరాలి ఆయుర్వేద విధానం
మూడు దశాబ్దాల చట్టసభల సభ్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు చెన్నమనేని రాజేశ్వరరావు
బాలల సినీ గీతకారుడు డా. సి.నారాయణ రెడ్డి
రిజర్వేషన్లు సామాజిక న్యాయం కోసం
విగ్రహం
తీరిక లేని ప్రధాని, సాహిత్య పిపాసి పి.వి.
తెలుగు ధ్వనిలో బహు లయలు
ప్రేక్షక హృదయాలలో శాశ్వత ముద్ర వేసిన పాకీజా
అపశతుల కోయిల ?!
ఉపాధ్యాయ, ఉప్పు సత్యాగ్రహి స్వామి రామానంద తీర్థ
పంజాబీ పల్లెటూరి స్త్రీ జీవన సమస్యలను చిత్రించిన ''గేలో''
బైపొలార్‌ రెండు పరస్పర వ్యతిరేక లక్షణాలు
నాటక రంగానికి జేజేలు
జానపద బాలల కవి పాలడుగు నాగయ్య
ఇంటికో దీపం!!
భారతీయ సినిమా తొలితరం నటి దేవికా రాణి
''నాది దు:ఖం వీడని దేశం''

తాజా వార్తలు

01:08 PM

హైదరాబాద్‌లో బ్లూ ఫ్యాబ్ స్వి‌మ్మింగ్ ఫూల్ సీజ్‌

01:01 PM

టెస్ట్ డ్రైవ్ చేస్తానని చెప్పి కారు ఎత్తుకెళ్లాడు..

12:57 PM

పుట్టినరోజు పేరుతో బాలికకు 35 ఏండ్ల వ్యక్తితో పెండ్లి..!

12:44 PM

వేములవాడ ఆలయం వద్ద పసికందు కిడ్నాప్

12:36 PM

జ్ఞానవాపి మసీదులో శివలింగం

12:27 PM

24 గంటల్లో దేశంలోకి నైరుతి రుతుపవనాలు..!

12:22 PM

ఘోర ప్రమాదం..తల, మొండెం వేరు

12:19 PM

నేపాల్‌కు చేరుకున్న ప్ర‌ధాని మోడీ

12:10 PM

ఏపీలో మహిళా వాలంటీర్ దారుణ హత్య

12:00 PM

రష్యా అధ్యక్షుడికి తీవ్ర అస్వస్థత..!

11:54 AM

వేముల‌వాడ గుడి వ‌ద్ద ప‌సికందు కిడ్నాప్

11:50 AM

యూపీలో డిజిటల్ లైంగికదాడి..!

11:34 AM

49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.. ఎక్కడంటే..?

11:30 AM

విద్యుత్ శాఖ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం

11:23 AM

విజయ్ దేవరకొండ, సమంతల 'ఖుషీ`ఫస్ట్ లుక్ విడుదల

11:17 AM

నిజామాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

11:14 AM

నిద్రమత్తులో భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి

11:06 AM

నేడు టీపీసీసీ కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం

10:54 AM

అస్సాంలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు..

10:27 AM

నిజామాబాద్ జిల్లాలో కంటైనర్-కారు ఢీ..ఐదుగురికి గాయాలు

10:25 AM

దేశంలో కొత్త‌గా 2,202 పాజిటివ్ కేసులు

09:08 AM

న్యూయార్క్ కాల్పుల ఘ‌ట‌న‌పై స్పందించిన బైడెన్

08:56 AM

తిరుమలలో భక్తుల రద్దీ

08:47 AM

బైక్‌పై 35 చలాన్లకు రూ. 8,125 బకాయి వసూలు

08:33 AM

నేడు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు

08:17 AM

క‌మ‌ల్ హాస‌న్ 'విక్ర‌మ్' ట్రైల‌ర్

07:42 AM

ఆగివున్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..ప్రయాణికులకు గాయాలు

07:36 AM

బాలుడి పెదా‌లపై పురు‌షుడు ముద్దు..అస‌హ‌జ శృంగార‌మేమీ కాదు

07:22 AM

జగిత్యాల జిల్లాలో భారీ వర్షం

07:19 AM

ఐపీఎల్ : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.