Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
క్రీడాశాఖ కమిటీపై రెజ్లర్ల అసంతృప్తి | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jan 25,2023

క్రీడాశాఖ కమిటీపై రెజ్లర్ల అసంతృప్తి

- ఏర్పాటు ప్రక్రియలో సంప్రదించలేదు
- రెజ్లర్లు వినేశ్‌, సాక్షి, బజరంగ్‌ ట్వీట్లు
నవతెలంగాణ-న్యూఢిల్లీ
భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ), బిజెపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై లైంగిక ఆరోపణలు, ఆర్థిక అవకతవకల ఆరోపణలను విచారణ చేసేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నియమించిన కమిటీ పట్ల రెజ్లింగ్‌ క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ నియంతృత్వ విధానాలతో దశాబ్దకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రెజ్లింగ్‌ క్రీడాకారులు, బిజెపీ ఎంపీపై చట్టపర చర్యలు తీసుకోవాలని మూడు రోజుల పాటు జంతర్‌మంతర్‌ వద్ద నిరసన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. జంతర్‌ మంతర్‌ ఆందోళనలో భారత్‌కు ఒలింపిక్‌, వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పతకాలు సాధించిన వినేశ్‌ ఫోగట్‌, సాక్షి మాలిక్‌, అన్షు మాలిక్‌, బజరంగ్‌ పూనియా, దీపక్‌ పూనియాలు ఉన్నారు. రెజ్లర్ల ఆందోళనకు దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం డబ్ల్యూఎఫ్‌ఐ బాధ్యతల నుంచి బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను తాత్కాలికంగా తప్పిస్తూ, విచారణ కమిటీ ఏర్పాటు అంగీకారం తెలిపింది. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ హామీతో రెజ్లర్లు మూడు రోజుల ఆందోళనను విరమించారు.
సంప్రదించలేదు! : డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ సహా ఆఫీస్‌ బేరర్లను బాధ్యతలకు దూరంగా ఉండమని ఆదేశిస్తూ క్రీడాశాఖ సర్క్యూలర్‌ జారీ చేసింది. బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై ఆరోపణలను విచారణ చేసే కమిటీని ఏర్పాటు చేసే ప్రక్రియలో రెజ్లింగ్‌ క్రీడాకారులతో భాగం చేస్తామని మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ హామీ ఇచ్చారు. దిగ్గజ బాక్సర్‌ ఎంసీ మేరీకోమ్‌ అధ్యక్షతన ఐదుగురు సభ్యుల విచారణ, పర్యవేక్షణ కమిటీని క్రీడాశాఖ సోమవారం ప్రకటించింది. మంత్రి హామీ మేరకు విచారణ కమిటీ ఏర్పాటు అంశంలో ఎటువంటి సంప్రదింపులు జరుపలేదని రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒలింపిక్‌ మెడలిస్ట్‌, దిగ్గజ రెజ్లర్‌ యోగేశ్వర్‌ దత్‌, మిషన్‌ ఒలింపిక్‌ సభ్యురాలు, మాజీ షట్లర్‌ తృప్తి, సారు మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాధికా శ్రీమాన్‌, టాప్స్‌ మాజీ సీఈవో రాజేశ్‌ రాజగోపాలన్‌ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. నాలుగు వారాల్లో ఈ కమిటీ విచారణ నివేదికను క్రీడాశాఖకు అందజేయాల్సి ఉంది. కమిటీ నివేదికపై క్రీడాశాఖ తదుపరి నిర్ణయం తీసుకునే వరకు మేరీకోమ్‌ సారథ్యంలోని పర్యవేక్షణ కమిటీ డబ్ల్యూఎఫ్‌ఐ వ్యవహారాలను చూడనుంది. భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) సైతం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. మేరీకోమ్‌ సారథ్యంలోని పర్యవేక్షణ కమిటీతో కలిసి ఐఓఏ కమిటీ సైతం సమాంతర విచారణ జరుపనుంది. ఆర్థిక అవకతవకల ఆరోపణలు ఎదుర్కొన్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య సహాయ కార్యదర్శి వినోద్‌ తోమర్‌ (ప్రభుత్వ ఉద్యోగి)ను సస్పెండ్‌ చేస్తూ క్రీడాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మాట తప్పడంపై రెజ్లర్లు ట్విట్టర్‌ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. 'డబ్ల్యూఎఫ్‌ఐపై విచారణ, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు ముందు మమ్మల్ని (రెజ్లర్లు) సంప్రదిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. కమిటీ ఏర్పాటు ప్రక్రియలో ఎవరూ సంప్రదించే ప్రయత్నం చేయకపోవటం అత్యంత విచారకరం' అంటూ వినేశ్‌ ఫోగట్‌, బజరంగ్‌ పూనియా, సాక్షి మాలిక్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు ప్రధాని నరెంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, క్రీడామంత్రి అనురాగ్‌ ఠాకూర్‌లను ట్యాగ్‌ చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సాత్విక్‌ జోడీకి టైటిల్‌
తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ నిఖత్‌ జరీన్‌
బంగారు నిఖత్‌
పసిడి పంచ్‌
మనుకు కాంస్యం
ఇంగ్లాండ్‌, శ్రీలంక, యుఏఈ!
సింధు పరాజయం
రుద్రాంక్ష్‌ కాంస్య గురి
మెస్సిఏ 800 గోల్స్‌
పసిడి పోరుకు నిఖత్‌
ఆ బాధ్యత ఆటగాళ్లదే!
శ్రీకాంత్‌ ఔట్‌
పోరాడినా..
షూటింగ్‌లో భారత్‌కు తొలిస్వర్ణం
సిరీస్‌ నీదా?నాదా?
క్వార్టర్‌ఫైనల్లో నిఖత్‌
ఈ బలహీనత దాటేదెలా?
క్వార్టర్స్‌లో సాక్షి
కివీస్‌ క్లీన్‌స్వీప్‌
కుప్పకూలి..!
ఎ.ఆర్‌ రావుకు టెన్నిస్‌ టైటిల్‌
డబుల్స్‌ చాంప్‌ బోపన్న జోడీ
ప్రీ క్వార్టర్స్‌లో నిఖత్‌
కథ ముగిసింది
తీరంలో తేల్చేస్తారా?
గెలిపించిన రాహుల్‌, జడేజా
సెమీస్‌కు త్రీసా-గాయత్రి
అంతర్జాతీయ క్రికెట్‌కు టిమ్‌ పైన్‌ గుడ్‌బై
గిల్‌, రాహుల్‌కు పరీక్ష
నిఖత్‌ శుభారంభం

తాజా వార్తలు

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.