Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కాలువల నిర్మాణంలో అలక్ష్యం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 29,2022

కాలువల నిర్మాణంలో అలక్ష్యం

- ఆయకట్టుకు చేరని నీళ్లు
- అంచనా వ్యయాలు పైపైకి
- ప్రజాధనానికి తూట్లు
- రీడిజైన్ల పేరుతో డీపీఆర్లకు ఎసరు
- అసంపూర్ణంగా సాగునీటి ప్రాజెక్టులు
బి.బసవపున్నయ్య
ఇల్లు అలకగానే పండుగ కాదంటారుపెద్దలు. ఈ నానుడి సాగునీటి ప్రాజెక్టులకు సరిగ్గా సరిపోతుంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల ధన దాహాం మూలంగా విలువైన ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది. ఆపైన ప్రజలపై పదే పదే భారం పడుతున్నది. సాగునీటి ప్రాజెక్టులను సంపూర్ణంగా నిర్మించని ఫలితంగా ఆశించిన ప్రయోజనాలు నెరవేరడం లేదు. పూర్తిస్థాయి ప్రాజెక్టునివేదిక (డీపీఆర్‌) ప్రకారం ప్రాజెక్టులు కడితే ఆర్థికనష్టాలు ఉండవనేది సాగునీటిరంగ నిపుణుల మాట. రాష్ట్రంలో దాదాపు అన్నీ ప్రాజెక్టుల నిర్మాణాలు ప్రభుత్వాలు, కాంట్రాక్టర్లతో కుదు ర్చుకున్న డీపీఆర్‌ ఒప్పందం(అగ్రిమెంట్‌) ప్రకారం లేవు. అందుకే ఆయ కట్టు పూర్తిస్థాయిలో ఉనికిలోకి రాలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సంపూర్ణ ప్రాజెక్టు అంటే..
   పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) కుదుర్చుకున్నప్పటి నుంచి నిర్ణయించిన రేట్లనే అమలుచేయాలి. నిర్ణీత కాలానికి పూర్తి చేయాలి. అప్పుడే అది ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు అవుతుంది. కానీ భూసేకరణ జరగలేదనీ, బిల్లులు ఇవ్వడం లేదంటూ కాంట్రాక్టర్లు అదనపు నిధుల కొరకు వెంపర్లాడుతూ అంచనాల సవరణ(రివైజ్డ్‌ ఎస్టిమేట్లు) పేరుతో డీపీఆర్‌లో ఉన్న మొత్తం కంటే నాలుగైదు రెట్లు పెంచిన ఘటనలు అనే కం. ఈ తరహా ప్రాజెక్టులు రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు రూ. 40.15 కోట్లతో ప్రారంభించి రూ. 3000 కోట్లు వ్యయం చేసినా మొదటి దశ పూర్తికాలేదు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, శ్రీరాంసాగర్‌ రెండోదశ తదితర భారీ ప్రాజెక్టులేగాక ఆసీఫాబాద్‌ను ఆనుకుని ఉన్న జగన్నాధపురం ప్రాజెక్టు రూ. 60 కోట్లతో చేపట్టి రెండు దశాబ్ధాలు దాటింది. నేటికి దానికి రూ. 250 కోట్లు ఖర్చుపెట్టినా పూర్తికాకపోవడం తెలిసిందే.
ఎవరెవరు.. ఎంతెంత
   రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచే నిర్మాణంలోకి వచ్చాయి. ఆయా రాజకీయ పార్టీల పరిపాలనాకాలంలో నిర్మాణాలు చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వపాలనలో రూ. 17 వేల కోట్లు ఖర్చుపెట్టారు. అలాగే వె.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ. 92 వేల కోట్లు వ్యయం చేశారు. ఇకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గత ఏడేండ్లుగా ఈ సాగునీటి పథకాలపై రూ.1.5లక్షలకోట్లు వెచ్చించారు. అయినా రాష్ట్రంలో ఏఒక్కప్రాజెక్టూ సంపూర్ణంగా నిర్మాణంజరగలేదు.
రివిట్‌మెంట్‌ పనుల నుంచి
   ప్రాజెక్టు పూర్తికావడమంటే ఆ ప్రాజెక్టు డిజైన్‌లో చెప్పినట్టుగా రివిట్‌మెంటుతోపాటు కాలువల లైనింగ్‌ పనులు జరగాలి. లైనింగ్‌ కోసం పూర్తిస్థాయి పరిమాణంతో కూడిన సిమెంట్‌ పనులు జరగకపోతే ప్రాజెక్టు ఆయక ట్టుకు న్యాయం జరగదు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే కేవలం 50 క్యూసెక్కులు మాత్రమే కాలువ చివరన ఉన్న ఆయకట్టును చేరుతుంది. దీంతో నీరు వృధా అవడమేగాక ఆయకట్టు నష్టపోతుంది. బ్రాంచ్‌కెనాళ్లు, రివిట్‌మెంటు, లైనింగ్‌ పనులు పెండింగ్‌లో ఉంటూనే ఉన్నాయి. కాలువల్లో చెట్లు, చెత్తాచెదారం పేరుకుపోయి నీళ్లు భూమిలోకి ఇంకిపోతున్నాయి. అంతే గాక అవి నీటి ప్రవాహానికి ఆటంకంగా మారుతున్నాయి. ప్రాజెక్టు పూర్తయిందని చెప్పాలంటే కాలువలే కీలకం. ఆ పనులను వదిలేసి ప్రభుత్వాలు మాత్రం ప్రాజెక్టులు పూర్త య్యాయని చెబుతుంటాయి. తద్వారా నష్టమే తప్ప లాభం జరగదు.
ఎందుకు అసంపూర్ణం..?
   రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా కాంట్రాక్టర్లు మార తారు. డీపీఆర్లనూ సవరిస్తారు. డీపీఆర్‌ను మార్చకపోతే పాత కాంట్రాక్టర్లనే కొనసాగించాల్సి వస్తున్నది. పాతవారిని తొలగించాలంటే ప్రాజెక్టును రీడిజైన్‌ చేయాలి. అందులో మార్పులు చేస్తూ కొత్త డీపీఆర్‌ను సర్కారు ఆమోదించాల్సి ఉంటుంది. నేటి ప్రభుత్వాలు అదే చేస్తున్నాయి. తద్వారా ప్రజాధనం వృధా అవుతున్నది.
   అవసరం ఉన్నా , లేకున్నా డీపీఆర్లల్లో మార్పులుచేస్తూ తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకునే పనిలో ప్రభుత్వాలు ఉంటున్నాయి. ఆనేపథ్యంలో ప్రజలపై ఆర్థిక భారాలు తప్ప, మరే ఇతర లాభం లేదని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు.
అనుమతులు
   సాధారణంగా ప్రాజెక్టుల నిర్మాణాలు జరగాలంటే నాలుగు రకాల అనుమతులు తీసుకోవాలి. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), అటవీశాఖ, పర్యావరణం, సాంకేతిక అనుమతులు తప్పనిసరి. వీటిలో ఏదీ సరిగ్గా లేకపోయినా ప్రాజెక్టు నిర్మించడానికి వీలుండదు. ప్రభుత్వాలు ముందు, వెనకా అనుమతులు తీసుకుని నిర్మాణం చేపడుతుంటాయి.
కాస్ట్‌-బెనిఫిట్‌ రేషియో
   డీపీఆర్లల్లో సాంకేతిక అంశాలను ఎప్పటికప్పుడు మార్చడం మూలంగా సవరణ అంచనాలు పెరిగి ఆర్థికభారంతోపాటు నిర్మాణం ఆలస్యమవుతుంది. సాంకేతిక అంశాలు పరిశీలించి నప్పుడు కాస్ట్‌-బెనిఫిట్‌ రేషియో 1:4 లేదా 1:5కు మించ రాదు. అంటే ఏదైనా ప్రాజెక్టుపై పెట్టిన పెట్టుబడి కనీసం నాలుగైదు సంవత్సరాల్లో తిరిగి రావాల్సి ఉంటుంది. కానీ నేడు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు రెండు దశాద్ధాలు గడిచి నా సర్కారుకు పెట్టిన పెట్టుబడి తిరిగిరావడంలేదు. శ్రీరాం సాగర్‌, జురాల, నాగార్జునసాగర్‌ మినహా మిగిలినా అన్ని ఎత్తిపోతల(లిఫ్ట్‌ ఇరిగేషన్‌)పథకాలే కావడం గమనార్హం. ఈ ప్రాజెక్టుల జీవితకాలం 25 సంవత్సరాలు మాత్రమే. ఆలోపుగానీ, ఆ తర్వాతగానీ పంపులు, పైపులు మార్చాల్సి ఉంటుంది. రివిట్‌మెంట్‌, లైనింగ్‌ పనులకు మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ పథకం ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందవు. చిన్న పథకాలైన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నెదర్లాండ్స్‌ దేశం సహకారంతో నిర్మించిన బెక్కెం లిఫ్ట్‌, గూడం, బొడబండ, జటాపూర్‌, కొడూరు, గోపాలపురం, చలపాడు, చిన్నమర్రూర్‌ ప్రాజెక్టులకు పట్టినగతే ఈ లిఫ్ట్‌ పథకాలకూ పడుతుంది.
సర్కారు ఏంచేయాలి ?
   రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌ను కచ్చితంగా అమలుచేయాలి. ప్రాజెక్టులను సత్వరమే చేపట్టి డీపీఆర్‌ ప్రకారం సమయా నుకూలంగా పూర్తిచేయించగలిగితేనే సత్ఫలితాలు వస్తాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ అగ్రిమెంట్‌ పొడిగించరాదు. ఆమేరకు పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలి. ప్రజాధానం వృధా కాకుండా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలి.
   కాగా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు ఇప్పుడు అసం పూర్ణంగానే ఉండటం అందరికి తెలిసిందే. ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు బడ్జెట్‌లో స్పష్టంగా చూపించాలి. పారదర్శకత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. రహాస్యం ఉండకూడదు. నిధుల నిర్వహణ విషయంలో పారదర్శకత అవసరమని సాగునీటిరంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈఎస్‌ఐ ఆధ్వర్యంలో ....ప్రజా వైద్యశాలలో ఉచిత చెకప్‌
ఫెడరల్‌ వ్యవస్థను దెబ్బతీస్తున్న బీజేపీ ప్రభుత్వం
కులగజ్జి మూర్ఖుల కుట్రలను తిప్పికొట్టండి
సంతల్లో కేటుగాళ్లు
స్పీడ్‌ పెరిగితే పెనాల్టీలే...
కలిసికట్టుగా పనిచేయండి
శ్రీకృష్ణ కమిటీ ఫీజులు అమలు చేయాలా? వద్దా?
సింగిల్‌ పిక్‌ కాటన్‌ సాగుకు ప్రోత్సాహం : సీఎస్‌
ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్‌ అధికారులు
నీట్‌ విద్యార్థులే టార్గెట్‌
'గీతమ్‌'ను సందర్శించిన యూకే బృందం
పెట్టుబడుల రాజధానిగా తెలంగాణ
కొట్రలో ఘనంగా మకర తోరణ మహౌత్సవం..
ఇక్కడి బస్తీ దవాఖాలను ఎందుకు సందర్శించలేదు?
రైల్వేలో కాంట్రాక్ట్‌ వ్యవస్థను ఎత్తివేయాలి
ఏసీబీకి చిక్కిన ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌, ఫీల్డ్‌ ఆఫీసర్‌
రాజ్యసభకు దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డి నామినేషన్‌
భీంగల్‌లో 100 పడకల ఆస్పత్రి
ప్రధాని మోడీ.... సమాధానం చెప్పాలి
ఇద్దరు మావోయిస్టు సభ్యుల అరెస్టు
ప్రభుత్వ నియంతృత్వ విధానాలతోనే రైతులకు కష్టాలు
49 మందికి కరోనా
బీసీ బిల్లు సాధన కోసం పోరాటాలు ఉధృతం : దాసు సురేశ్‌
జీరో టాలరెన్స్‌ ఆఫ్‌ కరప్షన్‌ను తెలంగాణలో అమలు చేయాలి
రాష్ట్రానికి వర్షసూచన
తెలంగాణ మసీదులను తవ్వడానికి సిద్ధమా
అడిగినంత జీతం ఇవ్వరు...
ల్యాండ్‌పూలింగ్‌పై రైతుల ఆగ్రహం
డిగ్రీ కాలేజీలపై వేటు!
అటూ.. ఇటూ..

తాజా వార్తలు

08:25 AM

హైదరాబాద్‌లో అగ్ని ప్ర‌మాదం

08:54 PM

తెలంగాణలో కొత్తగా 49 కరోనా కేసులు

08:50 PM

ఏపీ అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

08:44 PM

హైద‌రాబాద్‌కు రూ. 500 కోట్ల భారీ పెట్టుబడి

08:37 PM

జూన్ 5న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష

08:28 PM

జీహెచ్ఎంసీ ప‌రిధిలో వాహ‌నాల వేగ ప‌రిమితి పెంపు

08:22 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న లక్నో

08:18 PM

హైద‌రాబాద్‌లో మ‌రో సైబ‌ర్ క్రైమ్..!

08:05 PM

టాయిలెట్‌లో కూర్చొని వీడియోగేమ్‌ ఆడుతుండగా పాము కాటు..!

07:52 PM

ఇసుక దిబ్బ కూలి ఇద్దరు కూలీలు మృతి

07:46 PM

ఎమ్మెల్సీ అనంత బాబును సస్పెండ్ చేసిన వైసీపీ

07:36 PM

అనుమతి లేకుండా రాహుల్ గాంధీ లండన్ వెళ్లారు : కేంద్రం

07:23 PM

డ్ర‌గ్స్ కేసులో మాజీ ఎంపీ కుమారుడు అరెస్టు

07:19 PM

లాడ్జీ‌లో పిల్ల‌ల‌తో స‌హా నిద్ర‌మాత్ర‌లు మింగిన దంప‌తులు..!

07:07 PM

రేపు బెంగ‌ళూరుకు సీఎం కేసీఆర్

07:01 PM

కోనసీమ జిల్లాలో ఎస్పీ కారుపై రాళ్ల దాడి

06:53 PM

మహిళపై ఆరుగురు వలస కూలీల లైంగికదాడి, హత్య..!

06:31 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

06:25 PM

యాసిన్ మాలిక్‌కు యావజ్జీవ శిక్ష

06:19 PM

ఇంట్లో దొంగతనం చేసి 'ఐ లవ్ యూ`అని రాసిన దొంగలు..!

06:03 PM

తపాలా శాఖలో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

05:43 PM

ఏసీబీకి రెడ్ హ్యాండ‌డ్‌గా దొరికిన శంషాబాద్‌ అటవీ అధికారి

05:36 PM

గనిలో వజ్రం కనుగొన్న మహిళ..!

05:29 PM

ఎస్పీజీ ఆధీనంలో బేగంపేట విమానాశ్రయం..

05:20 PM

నాగచైతన్య 'థ్యాంక్యూ`టీజ‌ర్ విడుదల

05:15 PM

తెలంగాణకు మరో పెట్టుబడి

05:11 PM

మాదాపూర్‌ ఓయో రూంలో వ్యభిచారం..!

05:01 PM

అల్లర్లకు పాల్పడిన 46 మంది అరెస్టు : ఏపీ హోం మంత్రి వనిత

04:53 PM

నష్టాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:44 PM

పాఠశాల గొడలు, మెట్లపై 'సారీ..సారీ..` అని రాతలు..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.