Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నేటి నుంచి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Nov 27,2022

నేటి నుంచి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభ

- ఏర్పాట్లు పూర్తి చేసిన ఆహ్వానం సంఘం
- సభాస్థలాన్ని పరిశీలించిన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి
- నేడు జిల్లా కేంద్రంలో భారీ ప్రదర్శన
- 30 వేల మందితో ఎన్జీ కళాశాలలో బహిరంగ సభ
నవతెలంగాణ- నల్లగొండ
          పోరాటాల గడ్డ నల్లగొండ జిల్లా రైతు ఉద్యమ కార్యాచరణకు వేదికైంది. వ్యవసాయ జిల్లాగా పేరొందిన నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆదివారం నుంచి మూడ్రోజుల పాటు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 2వ మహాసభ జరగనుంది. ఈనెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరుగుతున్న రైతు వేడుకకు అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు చేపట్టిన రైతు ఉద్యమాలపై సమీక్షించుకోవడంతోపాటు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణను మహాసభలో రూపొందించనున్నారు. రైతాంగ సమస్యలు తీవ్రమవుతున్న తరుణంలో ఈ మహాసభ ప్రాధాన్యత సంతరించుకుంది. పట్టణంలోని ఏచూరిగార్డెన్‌ ఫంక్షన్‌హాల్‌లో జరుగుతున్న మహాసభలో 800 మంది ప్రతినిధులు పాల్గొంటారు.
ఆదివారం జరిగే బహిరంగసభకు 30 వేలమంది రైతులు తరలిరానున్నారు. దీనికి జాతీయ స్థాయి నాయకులూ హాజరవుతున్నారు. మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ పది రోజులుగా నగరంలో సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలను రైతుసంఘం, మహాసభ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో మహాసభకు సంబంధించిన ప్లెక్సీలను ఏర్పాటు చేసి వివిధ కూడళ్లలో గోడరాతలు రాశారు. బహిరంగసభ జరిగే ఎన్‌జీ కళాశాల మైదానం వద్ద, ప్రతినిధుల సభ జరిగే ఏచూరిగార్డెన్‌ ఫంక్షన్‌హాల్‌ను స్వాగత తోరణాలతో సిద్ధం చేశారు.
మహాసభ కార్యక్రమ వివరాలు..
          మహాసభ మొదటి రోజు 27న నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో బహిరంగసభ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు నగరంలో రైతుప్రదర్శన ఉంటుంది. కలెక్టరేట్‌ ఎదురుగా ఎఫ్‌సీఐ రోడ్‌ నుంచి ప్రకాశంబజార్‌ మైసయ్య విగ్రహం పెద్దగడియారం మీదుగా ఎన్‌జీ కళాశాల మైదానానికి చేరనుంది. అనంతరం అక్కడ సభ ప్రారంభం కానుంది. మహాసభ జరిగే ప్రాంతాన్ని వీరనారి మల్లు స్వరాజ్యం నగరంగా నామకరణం చేశారు. మహాసభకు ఏఐకేఎస్‌ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ అశోక్‌ దావలె, ప్రధానకార్యదర్శి హన్నన్‌మొల్లా, జాతీయ సహాయ కార్యదర్శి విజ్జూ కృష్ణన్‌, ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌, ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, ఆహ్వానసంఘం అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు నంద్యాల నర్సింహారెడ్డి హాజరవుతున్నారు.
28న ఉదయం నుంచి ప్రతినిధుల సభ ఏచూరిగార్డెన్‌ ఫంక్షన్‌హాలులో ప్రారంభం కానుంది. ఈ వేదికకు మాలి పురుషోత్తంరెడ్డి, గొర్ల ఇంద్రారెడ్డి ప్రాంగణంగా నామకరణం చేశారు. 29న 'వ్యవసాయ సమస్యలు-ఐక్యఉద్యమాలు- ఆవశ్యకత' అంశంపై సదస్సు జరగనుంది. ఇదే సమయంలో వామపక్ష రైతు సంఘాల సందేశాలు ఉంటాయి. మధ్యాహ్నం చర్చలు, వివిధ అంశాలపై తీర్మానాలు ఉండనున్నాయి. అనంతరం నూతన రాష్ట్ర కమిటీ ఎన్నికతో మహాసభ ముగుస్తుంది.
సభావేదికను పరిశీలించిన జూలకంటి
          ఎన్జీ కళాశాల ఆవరణలో ఆదివారం నిర్వహించనున్న బహిరంగ సభ వేదిక, ఏచూరి గార్డెన్‌లో ప్రతినిధుల సభ ఏర్పాట్లను శనివారం ఆహ్వానసంఘం అధ్యక్షులు, తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి పరిశీలించారు. ఆయన వెంట ఆహ్వాన సంఘం సభ్యులు రైతు సంఘం రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, సయ్యద్‌హాషం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, ఎండి.సలీం, దండెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ తదితరులు ఉన్నారు.
మహాసభకు సంబంధించి అన్ని పూర్తి చేసినట్టు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మండల, గ్రామాల్లో ప్రచారం నిర్వహించినట్టు చెప్పారు. బహిరంగసభకు రైతులు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నా మన్నారు. భారీ ప్రదర్శనలో కోలాటం, పలు రకాల వేషధారణలతో కళాకారులు పాల్గొంటారని చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రయివేటు సంస్థలు ప్రజలను ఆదుకోవు
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం 9న మహాధర్నా
సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు
అదానీ ఆస్తుల లావాదేవీలపై 'సుప్రీం' పర్యవేక్షణలో విచారణ జరపాలి
పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలి
జాతీయవాదం పేరుతో దేశానికి పెనుముప్పు
విద్యకు 24 శాతం, వైద్యానికి 12 శాతం నిధులు కేటాయించాలి
నూతన రెవెన్యూ కార్యాలయాల నిర్మాణాలకు నిధులివ్వండి
చారిటీ కోసం ఫుడ్‌ కార్నివల్‌
ఇండ్లు, స్థలాలు దక్కే వరకు పోరాటం
టీఎస్‌ఆర్టీసీ విజిలెన్స్‌ ఎస్పీగా సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌
నేటినుంచి సర్కారు బడుల్లో బోధన బంద్‌
భద్రతకు ప్రాధాన్యతివ్వండి
బడ్జెట్‌లో ఆర్టీసీకి రెండుశాతం నిధులు కేటాయించాలి
హైదరాబాదులో శాండోస్‌ ప్రపంచ సామర్థ్య కేంద్రం
భారీ భద్రత మధ్య డెక్కన్‌ మాల్‌ కూల్చివేత
సాగునీటి ప్రాజెక్టులపై గెజిట్‌ను రద్దుచేయించాలి
జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1మెయిన్‌
రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్‌ మిట్టల్‌
హాస్టల్‌ వర్కర్ల బకాయిల కోసం 2న ఎమ్మెల్సీ నర్సిరెడ్డి నిరాహార దీక్ష : సీఐటీయూ
ఏకకాలంలో రుణమాఫీకి కేంద్రబడ్జెట్‌లో నిధులు కేటాయించాలి
బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీ టీమ్‌
నల్లగొండలో బీఆర్‌ఎస్‌కు వామపక్షాల పొత్తు కలిసొస్తుంది..
నిజామాబాద్‌ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..?
స్కాలర్‌ షిప్‌ రెన్యూవల్స్‌కు మార్చి 31వరకు గడువు పొడింగింపు
ఏసీబీ వలలో 'ఉపాధి' అధికారి
మాతృభాష పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం
పదోన్నతివ్వండి..న్యాయం చేయండి..
రబీ కరెంట్‌ డిమాండ్‌ 15,500 మెగావాట్లు ఏర్పాట్లు చేయండి
ఎమ్మెల్సీ వెంకట్‌రామ్‌రెడ్డి నివాసం, కార్యాలయాలపై ఐటీ దాడులు

తాజా వార్తలు

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

01:44 PM

బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట...

01:33 PM

బడ్జెట్‌లో మహిళలకు ప్రత్యేక పథకం..

01:18 PM

కొత్త‌ ఫిష్ క్యాంటీన్ ను ప్రారంభించిన‌ మంత్రి త‌ల‌సాని..

01:12 PM

భారీ లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు..

01:06 PM

కేజీ టు పీజీ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

05:21 PM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

09:37 AM

ఎమిరేట్స్ ప్రయాణికులకు చేదు అనుభవం..13 గంటలు ప్రయాణించి.!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.